Saturday, November 15, 2025
HomeదైవంKarthika Pournami: కార్తీక పౌర్ణమి నాడు ఇవి దానం చేయండి.. ఎన్నో జన్మల పుణ్యఫలం మీ...

Karthika Pournami: కార్తీక పౌర్ణమి నాడు ఇవి దానం చేయండి.. ఎన్నో జన్మల పుణ్యఫలం మీ సొంతం..!

Karthika Pournami 2025 Lucky Things To Donate: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అత్యంత పవిత్రమైనది. దేశవ్యాప్తంగా రేపే కార్తీక పౌర్ణమి జరుపుకోనున్నారు. కార్తీక మాసం రోజున శివుడు అనుగ్రహం పొందాలంటే అనేక పరిహారాలు పాటించాలి. కార్తీక మాసం నాడు తప్పకుండా కొన్ని దానాలు చేయాలి. వాటివల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం మీ సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు. అయితే, పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఏయే వస్తువులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

దీప దానం

కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా ముఖ్యం. ఆలయాల్లో లేదా పవిత్ర స్థలాల్లో దీపాలను ఎవరైతే దానం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుందని పూజారులు చెబుతున్నారు. దీప దానం అంధకారాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ దానం మోక్ష ప్రాప్తికి దారి చూపుతుందని పండితులు చెబుతున్నారు.

వస్త్ర దానం

ఈ పవిత్ర దినం పేదలకు, బ్రాహ్మణులకు కొత్త వస్త్రాలు దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ముఖ్యంగా చలికాలం కాబట్టి దుప్పట్లు లేదా వెచ్చని వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. ఈ దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

అన్న దానం

ఆకలితో ఉన్నవారికి అన్న దానం చేయడం గొప్ప పుణ్యం. కార్తీక పౌర్ణమి రోజున అన్నదానం చేస్తే దాతకు ఏ జన్మలోనూ ఆహారం కొరత ఉండదు. ఈ దానం మిక్కిలి సంతోషం కీర్తిని ఇస్తుంది.

ఫల దానం

తీపి పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు, పుణ్య ఫలం కూడా లభిస్తుంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎక్కువ మంది ఉపవాసం ఆచరిస్తుంటారు. అలాంటి వారికి పండ్లు దానం చేస్తే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు.

తులసి మొక్క దానం

కార్తీక మాసంలో తులసి మొక్కను పూజించడం వల్ల శుభం కలుగుతుంది. ఈ రోజున తులసి మొక్కను దానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. తులసి దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పుణ్య ఫలం పొందడానికి ఈ దానాలు చిత్తశుద్ధితో చేయాలని పండితులు చెబుతున్నారు. ఉదయం స్నానం చేసి, భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించిన తర్వాత సాయంత్రం దీపారాధన సమయంలో పేదవారికి దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad