Karthika Pournami- Zodiac Signs:ఈరోజు నవంబర్ 5 బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తి, ఆధ్యాత్మికతతో నిండిన వాతావరణం నెలకొంది. హిందూ క్యాలెండర్లో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పౌర్ణమి రోజున దీపారాధన, గంగాస్నానం, దానధర్మాలు చేయడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈసారి కార్తీక పౌర్ణమి విశేషత మరింతగా పెరిగిందని, ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసిరానుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
పండితుల ప్రకారం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడే కొన్ని ప్రత్యేక యోగాలు జీవనంలో సానుకూల మార్పులను తెస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా వృషభ, మిథున, కన్యా రాశుల వారికి ఈ రోజు ఎంతో శుభప్రదంగా ఉండబోతోందని వివరించారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/use-pearl-or-crystal-for-peaceful-sleep/
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ పౌర్ణమి రోజు మంచి మార్పులకు దారితీస్తుంది. ఈ నెలలో మూడు శుభయోగాలు కలసి రావడం వీరి జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఇప్పటివరకు ఎదురైన అడ్డంకులు తొలగి, కొత్త అవకాశాలు రావచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇంటిలో శుభకార్యాల సన్నాహాలు మొదలయ్యే అవకాశం ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ కాలంలో శారీరకంగా, మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ నెల అనుకోని ధనలాభాలు, ఆస్తి సంబంధించిన శుభవార్తలు అందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కలగొచ్చు. ఎవరికైనా అప్పుల భారంతో ఇబ్బందులు ఎదురైతే, ఆ సమస్యలు క్రమంగా తగ్గి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్నేహితులు, బంధువుల సహకారం లభించడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది.
మిథున రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది సరైన సమయం అని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినవారికి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని భావిస్తున్నారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ కార్తీక పౌర్ణమి విశేషంగా అనుకూలించనుంది. వీరికి ఉన్న ఆటంకాలు తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు. ఉద్యోగులు చేసిన కష్టానికి తగిన ప్రోత్సాహం పొందే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన చోట లాభాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంతేకాక, ఈ రాశి వారికి అనుకోని రూపంలో ధనప్రవాహం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్నపాటి విభేదాలు సర్దుబాటు అవుతాయి. ఆరోగ్య పరంగా కూడా ఇది మంచి సమయంగా మారబోతోంది. క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా కన్యా రాశి వారు అన్ని రంగాల్లో పురోగతి సాధించవచ్చు.
శుభయోగం..
ఈ మూడు రాశుల వారికి పౌర్ణమి రోజున ఏర్పడే యోగాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. దీపదానం, దానధర్మాలు చేయడం ద్వారా గ్రహశాంతి లభిస్తుందని సూచిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పౌర్ణమి చంద్రుని దర్శనం చేసుకోవడం, దీపారాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.


