Saturday, November 15, 2025
HomeదైవంKedarnath:మూతపడిన కేదార్‌నాథ్‌ ఆలయం..మళ్లీ ఆరు నెలల తరువాతే!

Kedarnath:మూతపడిన కేదార్‌నాథ్‌ ఆలయం..మళ్లీ ఆరు నెలల తరువాతే!

Kedarnath Temple Closed: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్‌నాథ్ ఆలయం భాయ్ దూజ్ పర్వదినం నాడు మూసివేశారు. హిమాలయ పర్వతాల మధ్య మందాకిని నది తీరంలో వెలసిన ఈ ఆలయం, శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం చార్ ధామ్ యాత్రలో భాగంగా లక్షలాది మంది భక్తులు ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటారు.

- Advertisement -

శీతాకాలం ప్రారంభమవడంతో…

అక్టోబర్ 23 ఉదయం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ ద్వారాలు మూసివేశారు. శీతాకాలం ప్రారంభమవడంతో ఆరు నెలలపాటు ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విరామ సమయంలో ఉఖీమఠ్ పట్టణంలోని ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారేశ్వరుడి ప్రతిమను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తారు. ఆలయ పల్లకిని పండితులు, అధికారులు, భక్తులు ఘనంగా తరలించారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/chhath-puja-2025-begins-on-october-25-important-rules-for-first-timers/

చార్ ధామ్‌లోని మిగతా ఆలయాలు…

కేదార్‌నాథ్ ఆలయ మూసివేతతో పాటు చార్ ధామ్‌లోని మిగతా ఆలయాలు కూడా ఈ కాలంలో మూసివేయడానికి సిద్ధమవుతున్నాయి. గంగోత్రి ఆలయం అక్టోబర్ 22న మూసివేయగా, యమునోత్రి ఆలయం అక్టోబర్ 23న మూసివేశారు. బద్రీనాథ్ ఆలయం నవంబర్ 25న శీతాకాల విరామంలోకి వెళ్తుంది.

ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పాల్గొని ఆలయ ఆరాధన కార్యక్రమాలను వీక్షించారు. అలాగే బద్రీ-కేదార్ ఆలయ సమితి (బీకేటీసీ) అధ్యక్షుడు హేమంత్ ద్వివేది, ఉపాధ్యక్షుడు రిషి ప్రసాద్ సతీ, కేదార్ సభ అధ్యక్షుడు పండిత్ రాజ్‌కుమార్ తివారీ, కేదార్ సభ మంత్రి పండిత్ అంకిత్ ప్రసాద్ సెమ్‌వాల్, ధర్మాధికారి ఓంకార్ శుక్లా, పూజారి బాగేశ్ లింగ్, ఆచార్య సంజయ్ తివారీ, అఖిలేష్ తదితరులు హాజరయ్యారు.

17.39 లక్షల మంది భక్తులు…

ఈ సంవత్సరం కేదార్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు చేరారు. యాత్ర ప్రారంభం నుండి ఇప్పటి వరకు మొత్తం 17.39 లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్ దర్శనాన్ని చేశారు. అక్టోబర్ 23 ఉదయం కూడా ఐదు వేలకు పైగా భక్తులు ఆలయ దర్శనానికి హాజరయ్యారు.

ప్రాంతంలో వాతావరణం చల్లబడటంతో ఆలయ పరిసరాల్లో మంచు కమ్ముకుంది. బుధవారం మధ్యాహ్నం వరకు కేదార్‌నాథ్‌లో పొగమంచు విస్తరించింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తుల భద్రత నిమిత్తం ఆలయాన్ని సాంప్రదాయ ప్రకారం మూసివేశారు.

ఆరు నెలల తర్వాత..

ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఈ ఆలయం మూసివేయడం అనేది స్థానిక సంప్రదాయం. ఆరు నెలల తర్వాత వసంత కాలం ప్రారంభంలో మళ్లీ కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుస్తారు. అప్పటివరకు ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారేశ్వరుడికి నిత్య పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు కూడా అక్కడికి చేరుకుని ప్రార్థనలు చేయవచ్చు.

Also Read:https://teluguprabha.net/devotional-news/who-are-the-five-beings-shani-fears-according-to-legends/

ఉత్తరాఖండ్ ప్రభుత్వం,ధార్మిక సంస్థలు కేదార్‌నాథ్ యాత్రను సజావుగా నిర్వహించేందుకు ముందుగా ఏర్పాట్లు చేశాయి. రవాణా, వసతి, వైద్య సేవలు, రక్షణ బృందాలు వంటి అనేక విభాగాలు యాత్రికుల సౌకర్యం కోసం సమన్వయంతో పనిచేశాయి. ఈ ఏడాది యాత్రలో భక్తుల సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad