Thursday, October 3, 2024
HomeదైవంKothakonda: కొత్తకొండ వీరభద్ర స్వామి హుండీ ఆదాయం 27 లక్షల పైమాటే

Kothakonda: కొత్తకొండ వీరభద్ర స్వామి హుండీ ఆదాయం 27 లక్షల పైమాటే

కొత్తకొండ యూనియన్ బ్యాంకులో జమ

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. స్వామి వారి హుండీలో 27,21,945/- ల నగదు, 1 గ్రాము బంగారం, రెండు కిలోల 730 గ్రాముల వెండి, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కిషన్ రావు తెలిపారు. ఈ మొత్తం జనవరి మాసంలో జరిగిన వీరభద్ర స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల రూపంలో వచ్చిన ఆదాయంగా తెలిపారు. హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ వరంగల్ ఇన్స్పెక్టర్ జి.సంజీవరెడ్డి పర్యవేక్షణలో జరిగిందన్నారు.

- Advertisement -

ఈ మొత్తాన్ని కొత్తకొండ యూనియన్ బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు. ఈ లెక్కింపులో ఎంపీటీసీ యాటపోలు రాజమణి శ్రీనివాస్, ఎంపిడిఓ భాస్కర్, ముల్కనూర్ ఎస్సై సాయిబాబు, ఆలయ ఉపప్రధాన అర్చకులు రాజయ్య, ముఖ్య అర్చకులు రాంబాబు, సిబ్బంది సంజీవరావు, రామకృష్ణారావు, రవీందర్, శ్రీధర్,రాజు, బిక్షపతి, శ్రీ సరస్వతీ సేవా సమితి కొత్తకొండ, శ్రీ శివ సాయి సేవా సమితి ఎల్కతుర్తి, శ్రీ వెంకటేశ్వర సేవా సమితి హనుమకొండ, శ్రీ సాయి సేవా సమితి హనుమకొండ సభ్యులు, యూనియన్ బ్యాంకు కొత్తకొండ బ్రాంచ్ నుండి శ్రావణి, శశాంక్, మాజీ ఛైర్మెన్ పిడిశెట్టి కనకయ్య, కొత్తకొండ గ్రామస్తులు గోదాల సంపత్, కంకల సదానందం, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News