Sunday, October 6, 2024
HomeదైవంMahanandi: మహానందీశ్వరునికి లక్ష బిల్వార్చన

Mahanandi: మహానందీశ్వరునికి లక్ష బిల్వార్చన

కార్తీక సోమవారం, మాస శివరాత్రి సందర్భంగా..

మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాస సోమవారం, మాస శివరాత్రి సందర్భంగా మహానందీశ్వర స్వామికి వైభవంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ వారి బృందం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్వరుణ, కంకణధారణ చేసిన అనంతరం శ్రీ మహానందీశ్వర స్వామివారికి పీఠార్చనలు నిర్వహించి, మహన్యాసం చేసి 121 రుద్రాలతో మహా రుద్రాభిషేకం నిర్వహించారు.

- Advertisement -

ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి సుధాకుమారి దంపతులు, ఆలయ ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జునరావు అమృత దంపతులు, శాశ్వత దాతలు డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, విజయ కుమారి దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News