Thursday, July 4, 2024
HomeదైవంMahanandi: మహానందీశ్వరునికి కాణిపాకం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు

Mahanandi: మహానందీశ్వరునికి కాణిపాకం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు

ప్రత్యేక పూజలు, పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివార్లకు కాణిపాకం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం ఈవో వెంకటేశ్వర్లు, చైర్మన్ మోహన్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో కాణిపాకం దేవస్థానం తరపున సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.

- Advertisement -

ముందుగా వీరికి మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దేవస్థానం సిబ్బంది, వేద పండితులు అర్చకులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News