మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివార్లకు కాణిపాకం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం ఈవో వెంకటేశ్వర్లు, చైర్మన్ మోహన్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో కాణిపాకం దేవస్థానం తరపున సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/2fbc996f-d38d-4818-b97f-bd5372bf2b9d-1024x768.jpg)
ముందుగా వీరికి మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దేవస్థానం సిబ్బంది, వేద పండితులు అర్చకులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/fde06396-bf02-4290-9b4e-6b6cc4db58a6-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/5f4d0735-e078-4b6c-ab72-3b4f7be37ff7-1024x768.jpg)