Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: ఈనెల 28 న మహానంది ఆలయం మూసివేత

Mahanandi: ఈనెల 28 న మహానంది ఆలయం మూసివేత

చంద్రగ్రహణం అనంతరం మళ్లీ సేవలు, పూజలు

మహానంది ఆలయం ఈనెల 28 వతేదీ ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసి వేస్తామని మహానంది దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆలయ ప్రధాన అర్చకుడు మామిళ్ళపల్లి అర్జునశర్మ తెలిపారు. ఈ సందర్బంగా వారు ఈనెల 28 వతేదీ శనివారం సాయంత్రం 4 గంటలు నుండి 29 వ తారీకు ఉదయం 6 గంటల వరకు ఆలయం మూసి వేస్తున్నామన్నారు. తిరిగి 29 వతేదీ ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసిన అనంతరం స్వామివారి దర్శనం భక్తులకు యథావిధిగా కల్పించనున్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News