మహానందీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రముఖులను మహానంది దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి కలిసి ఆహ్వానించారు. ముందుగా మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికకు శాస్త్రీయంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/3dc68ef6-98a9-4afc-873e-c9110bfe55d3-1024x768.jpg)
అనంతరం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆహ్వాన పత్రికను నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచబ్రహ్మానందరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ కే.శ్రీనివాసులు, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి తదితరులకు ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, దేవస్థానం అధికారులు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/9db1c971-039c-4912-8b7c-8c5ac75419ad-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/16134db6-444a-46ac-9e9f-3ec7f3a40369-1024x576.jpg)