Tuesday, December 9, 2025
HomeదైవంMargashira Amavasya: మార్గశిర అమావాస్య పూజతో వీరికి ఎంత అదృష్టం అంటే

Margashira Amavasya: మార్గశిర అమావాస్య పూజతో వీరికి ఎంత అదృష్టం అంటే

Margashira Amavasya 2025: హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసం ఆధ్యాత్మిక దృష్ట్యా ఎంతో పవిత్రమైన కాలంగా పరిగణిస్తారు. ఈ నెలలో వచ్చే అమావాస్య రోజును మార్గశిర అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి, భక్తి భావంతో పూజలు నిర్వహించి, దానం చేయడం అత్యంత శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

ఈ సంవత్సరం మార్గశిర అమావాస్య నవంబర్ 19న ఉదయం 9 గంటల 43 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నవంబర్ 20న మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాలకు ముగుస్తుంది. అందువల్ల ప్రధానంగా నవంబర్ 20నే మార్గశిర అమావాస్య పూజలు జరపడం శుభదాయకమని పండితులు సూచిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/vivaha-panchami-2025-date-rituals-significance-explained/

సర్వార్థ సిద్ధి యోగం..

ఈ రోజు ఉదయం 10 గంటల 58 నిమిషాలకు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఆ సమయం దానధర్మాలు చేయడానికి ఉత్తమమైన ముహూర్తంగా పరిగణిస్తారు. భక్తులు తమ సామర్థ్యానికి అనుగుణంగా ఆహారం, వస్త్రాలు, ధాన్యాలు వంటి వస్తువులు దానం చేస్తే అనేక పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం.

మార్గశిర మాసం సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక శక్తి పరమావధిగా పండితులు వివరిస్తున్నారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీహరిని ఆరాధించడం ద్వారా సుఖశాంతులు, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని విశ్వాసం ఉంది. అలాగే, ఈ రోజున పితృదేవతలను స్మరించి తర్పణం చేస్తే వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని, వంశానికి పితృదోషం తొలగిపోతుందని వేదశాస్త్రాలు చెబుతున్నాయి.

నదుల్లో స్నానం..

ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం అత్యంత పుణ్యమయమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా గంగానదిలో స్నానం చేస్తే జన్మాంతర పాపాలు నశిస్తాయని, శరీరం, మనసు శుద్ధి పొందుతుందని నమ్మకం. స్నానం అనంతరం ఆహార పదార్థాలు, బట్టలు, ధాన్యాలు లేదా నువ్వులు వంటి వస్తువులు దానం చేయడం వల్ల మరింత శుభఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

దానం ధర్మం ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక కర్మకాండమే కాక, మనలో కరుణ, దయ, సమానత్వ భావనలను పెంపొందిస్తుంది. మార్గశిర అమావాస్య రోజు ఈ దాన ధర్మాలు చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, కుటుంబ ఐకమత్యం పెరుగుతాయని జ్యోతిష్య పండితులు వివరించారు.

మేష రాశి వారు..

ఈ రోజున ప్రతి రాశి వారికి దానం చేసే వస్తువులు వేర్వేరుగా సూచించడం జరిగింది.. మేష రాశి వారు వేరుశనగలు, రాగి ధాన్యాలు లేదా బెల్లం దానం చేస్తే శ్రేయస్కరంగా ఉంటుంది. వృషభరాశి వారికి పాలతో చేసిన వస్తువులు, పెరుగు, వెన్న దానం చేయడం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మిథున రాశి వారికి పచ్చని కూరగాయలు, పచ్చ పండ్లు, పెసర్లు ఇవ్వడం శుభప్రదం.

కర్కాటక రాశి వారు గోధుమపిండి, ఉప్పు, బియ్యం, చక్కెర వంటి అవసరమైన వస్తువులు ఇవ్వడం వల్ల సంతోషం కలుగుతుంది. సింహరాశి వారికి ఎర్ర కంది పప్పు, ఎర్ర మిరపకాయలు, గోధుమలు వంటి పదార్థాలను దానం చేయడం మంచిదిగా పండితులు వివరిస్తున్నారు. కన్య రాశి వారు గోశాలకు దానం చేయడం లేదా పెసర్లు ఇవ్వడం ద్వారా ధనలాభం పొందవచ్చు.

తుల రాశి వారికి తెల్లటి వస్త్రాలు, ఉప్పు, గోధుమపిండి వంటి వస్తువులు ఇవ్వడం పుణ్యప్రదంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు రాగులు, చిలగడదుంపలు, మసూర్ పప్పు దానం చేస్తే శుభఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారికి పసుపు రంగు దుస్తులు, పండిన అరటిపండ్లు లేదా శనగపిండి ఇవ్వడం లాభదాయకం.

Also Read:https://teluguprabha.net/devotional-news/meaning-of-a-symbol-in-palm-and-its-connection-to-luck/

మకర రాశి వారికి నల్ల నువ్వులు, అవిసె గింజలు, నల్ల ఆవాలు వంటి వస్తువులు దానం చేయడం శ్రేయస్కరం. కుంభరాశి వారికి నల్లటి వస్త్రాలు, తోలు పాదరక్షలు, దుప్పట్లు దానం చేయడం అనుకూలమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీనరాశి వారు శనగ పప్పు, మొక్కజొన్న లేదా వేయించిన శనగ పిండి ఇవ్వడం మంచిదని భావిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News