శ్రీశైలం(Srisailam) పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి(Mahasivaratri) మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అందిస్తున్న సేవలు, ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దగ్గరుండి సమీక్షించారు. శివ భక్తుల క్యూలైన్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. భక్తులకు కల్పించిన సదుపాయాలను అడిగి తెలుసుకుని, వారి యోగక్షేమాలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులకు సూచనలు అందించారు.
ఇప్పటివరకు ఎదురైన చిన్న చిన్న పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. అదనంగా, భక్తులు ఇరుముడిని విరమించే ప్రదేశాన్ని విస్తరించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
శివ భక్తుల కోసం చేపట్టిన మహా శివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లను అడుగు అడుగునా పరిశీలించిన మంత్రి, భక్తుల అభిప్రాయాలను స్వీకరించి, మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భక్తులకు విశేష అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.
ఏర్పాట్లు పరిశీలించిన వారిలో మంత్రి ఆనంతో పాటు శ్రీశైలం శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు