Friday, September 20, 2024
HomeదైవంNandavaram: ముగిసిన చౌడేశ్వరి ఉగాది ఉత్సవాలు

Nandavaram: ముగిసిన చౌడేశ్వరి ఉగాది ఉత్సవాలు

శక్తి స్వరూపిణి చౌడేశ్వరి జ్యోతుల ఉత్సవాలు వసంతోత్సవ కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం ఆలయం నుంచి చౌడేశ్వరీమాత ఉత్సవ విగ్రహాలను ఆలయ పూజారులు, సిబ్బంది తీసుకొని ఊరేగింపుగా రంగులు చల్లుకుంటూ వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో రామానుజన్‌, మాజీ చైర్మన్‌ పీఆర్‌. వెంకటేశ్వరరెడ్డి, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు రంగులు చల్లుకుంటూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో అమ్మవారి విగ్రహానికి చక్రస్నానం చేయించి ఆలయంలోకి చేర్చారు. దీంతో  ఉగాది పర్వదినాన ప్రారంభమైన చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు 7 రోజుల పాటు అత్యంత వైభవంగా ముగిశాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News