Thursday, September 19, 2024
Homeదైవంరామరామ అంటే చాలు ఏలిననాటి శని పారిపోతుంది

రామరామ అంటే చాలు ఏలిననాటి శని పారిపోతుంది

శనీశ్వరుడు ఎవరి జాతకంలోనైనా ఏడున్నర సంవత్సరాలుఃటే ఆకాలాన్ని “ఏలిన నాటిశని” అంటారు. ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరి. ఒక సమయంలో హనుమంతునికి ఏలిననాటి శనిగ్రహ కాలం దాపురించింది. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి బండలను తీసుకుని వచ్చి పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు ఒకబండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు వచ్చి నేను హనుమంతుని పట్టుకొనే కాలం వచ్చిందని శ్రీ రాముని అనుమతి అడిగాడు. నన్నెందుకు అడగడం నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీ రాముడు.హనుమంతుని వద్దకు వెళ్ళి శని నేను నీవద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు. నేను రామకార్యంలో నిమగ్నమై ఊన్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు. సరి ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు సరేనా అన్నాడు. హనుమ ఒప్పుకోలేదు. ఏడున్నర వారాలు అంటూ కాలప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు. హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే ఏడు క్షణాలు మాత్రం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు. అప్పుడు శనీశ్వరుడు నీకాళ్ళలో ప్రవేశించనా అని అడిగాడు హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి
పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. సరి నీచేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు. ఆరాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు. అన్నాడు హనుమంతుడు. అయితే నన్ను ఏం చెయ్యమంటావు ? నీభుజాల పైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు.
రామలక్ష్మణులను నా భుజాల మీద
ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు, అన్నాడు హనుమంతుడు.
పోనీ, నీ హృదయంలో ఉండ వచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. హృదయంలో, మహాలక్ష్మీరూపిణి అయిన సీతాదేవి, నాదేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ వున్నారు.. అక్కడ నీకు చోటు లేదు
అన్నాడు హనుమ. సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను అని శనీశ్వరుడు, హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై (అంటే శనీశ్వరుని మీద) పెట్టుకుని ఒక్కొక్కటిగా సముద్రంలో వేస్తున్నాడు
ఆబండరాళ్ళ బరువు మోయలేక
శనీశ్వరుని కనుగుడ్లు మీదకి వచ్చాయి మరో పెద్ద బండరాయి హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే, శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు హనుమంతుడు ఆరాయిని సముద్రంలో వేసిన తక్షణమే శనీశ్వరుడు హనుమశిరస్సుపై నుండి కిందకి దూకేశాడు. మారుతీ నీవల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది నిన్ను నేను పట్టలేను అంటూ ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు. హనుమంతునిముందా కుప్పిగంతులు! నిర్మల భక్తితో, నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు.
పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం
శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి
విముక్తి కలిగితీరుతుందని ఈ కథనం భావం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News