Saturday, November 15, 2025
HomeదైవంSaturn Effect: 2029 వరకు ఈ రాశి వారికి ఎల్నాటి శని..రోజూ వీటిని పాటిస్తే..!

Saturn Effect: 2029 వరకు ఈ రాశి వారికి ఎల్నాటి శని..రోజూ వీటిని పాటిస్తే..!

Saturn Effect- Shani Dosha:మీన రాశి వారికి ప్రస్తుత కాలం శనిగ్రహ ప్రభావం గల సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి వారి జీవనశైలిపై, ఆర్థిక స్థితిపై, కుటుంబ పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం శనిదేవుడు మీన రాశిలో సంచరిస్తున్నారు. ఈ పరిణామం 2029 ఏప్రిల్ వరకు కొనసాగనుంది.

- Advertisement -

శనిగ్రహం ప్రతి రెండున్నరేళ్లకు ఒకసారి రాశి మారుస్తుంది. ప్రతి మార్పుతో మూడు రాశులవారు ఎల్నాటి శని దశను అనుభవిస్తారు. ప్రస్తుతం శని మీన రాశిలో ఉండటంతో ఆ రాశివారు రెండవ దశను ఎదుర్కొంటున్నారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ రెండవ దశను అత్యంత క్లిష్టమైన సమయంగా పరిగణిస్తారు, ఎందుకంటే ఈ దశలో వ్యక్తుల జీవితంలో అనేక పరీక్షలు ఎదురవుతాయి.

Also Read:https://teluguprabha.net/devotional-news/mars-turns-direct-brings-luck-for-leo-aries-and-cancer-signs/

శనిగ్రహం మీన రాశిలోకి…

2025 మార్చిలో శనిగ్రహం మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రెండవ దశ ప్రారంభమైంది. ఇది 2027 వరకు కొనసాగుతుంది. 2027లో శని మేష రాశిలో ప్రవేశించగానే మీన రాశివారికి మూడవ దశ మొదలవుతుంది. ఆ దశ 2029 వరకు ఉంటుంది. ఆ తర్వాత శని వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు మీన రాశిపై ఎల్నాటి శని ప్రభావం పూర్తిగా ముగుస్తుంది.

పరీక్షల సమయం…

ప్రస్తుతం నడుస్తున్న ఈ కాలాన్ని జ్యోతిష్యులు “పరీక్షల సమయం”గా పేర్కొంటున్నారు. ఈ దశలో అనేక మీన రాశి వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబంలో విభేదాలు, మనసు అస్థిరత వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. అయితే ఈ కష్టాలను తగ్గించడానికి కొన్ని ఆచరణాత్మక చర్యలు, నిత్య ఆచారాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.

జ్యోతిష్య పండితుల సూచన ప్రకారం, శనిదేవుని కృప పొందేందుకు ప్రతిరోజూ “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని భక్తిగా జపించడం చాలా మేలు చేస్తుంది. ఈ మంత్రం మనసు ప్రశాంతంగా ఉంచడంలో, ప్రతికూల శక్తులను తగ్గించడంలో సహాయపడుతుంది.

నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినపప్పు…

శనివారం నాడు నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినపప్పు లేదా నల్లటి వస్త్రాలను దానం చేయడం శనిదేవుని సంతోషపరుస్తుందని చెబుతారు. అదేవిధంగా శనివారాల్లో రావి చెట్టుకు నీరు పోసి ప్రార్థన చేయడం కూడా శుభప్రదమని భావిస్తారు.

మంగళవారం, శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం ద్వారా మనసు ధైర్యంగా మారి, నెగెటివ్ ప్రభావాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

శని గ్రహం కర్మఫలదాతగా..

ఈ సమయంలో ఆచరించాల్సిన ముఖ్య నియమాలలో ఒకటి.. సోమరితనం, అబద్ధాలు, ఇతరులకు అన్యాయం చేయడం, అనవసర అప్పులు తీసుకోవడం వంటి వాటిని పూర్తిగా నివారించాలి. శని గ్రహం కర్మఫలదాతగా పరిగణిస్తారు. అంటే మనం చేసే పనుల ప్రకారం ఫలితాలు పొందుతాం. కాబట్టి, శని దశలో మంచి కర్మలు చేయడం ద్వారా శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

శని రెండవ దశలోని..

మీన రాశి వారికి శని రెండవ దశలోని ఈ సమయం కఠినంగా అనిపించినా, దీన్ని ఓర్పుతో ఎదుర్కోవడం అవసరం. కష్టాలకు భయపడకుండా ఎదుర్కొని, ధైర్యం కోల్పోకుండా నడిస్తే శని కృప లభిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కాలంలో ప్రార్థన, సేవా కార్యక్రమాలు, ఇతరులకు సహాయం వంటి సత్కార్యాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థికంగా కూడా మెల్లగా అభివృద్ధి సాధించవచ్చు.

2027 తర్వాత ప్రారంభమయ్యే మూడవ దశలో కొంత ఉపశమనం లభిస్తుందని, కానీ దానికీ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని చెబుతున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, అనవసర వ్యయాలు తగ్గించడం, కుటుంబ సంబంధాలలో సహనంతో వ్యవహరించడం ఈ కాలంలో అత్యవసరం.

Also Read: https://teluguprabha.net/devotional-news/meaning-of-x-mark-on-palm-in-palmistry-explained/

మీన రాశి వారు తమ జీవితంలో శనిదేవుని ప్రభావం నుండి రక్షించుకోవాలంటే ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రతిరోజూ ప్రార్థన చేయడం, సత్కార్యాలు కొనసాగించడం, కష్టపడి పనిచేయడం ద్వారా శని కృప లభిస్తుంది. శని కర్మఫలదాత కాబట్టి సదాచారం, సహనం, నిజాయితీ వంటి విలువలు పాటించే వారిని ఆయన ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad