Tuesday, September 17, 2024
HomeదైవంSrisailam: 28 రోజుల్లో 4 కోట్ల ఆదాయం

Srisailam: 28 రోజుల్లో 4 కోట్ల ఆదాయం

2321 యుఎస్ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 35 - కెనడా డాలర్లు..

    
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 75 లక్షల 21 వేల 688 రూపాయల నగదు రాబడిగా లభించగా, ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు.

- Advertisement -

ఈ హుండి లెక్కింపులో నగదుతో 350 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 6 కేజీల 280 గ్రాముల వెండి లభించాయి. వీటితో పాటు ఈ హుండీ లెక్కింపులో 2321 యుఎస్ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 35 – కెనడా డాలర్లు, 28 మలేషియా రింగిట్స్, 15 ఇంగ్లాండు పౌండ్స్, 4- సింగపూర్ డాలర్లు, 40 యూరోప్, – 20 – యూ.ఏ.ఈ దిర్హమ్స్, మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News