Sunday, September 8, 2024
HomeదైవంSrisailam: 9 రోజుల్లో 2,70,51,419 ఆదాయం

Srisailam: 9 రోజుల్లో 2,70,51,419 ఆదాయం

 శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీల లెక్కింపు జరిగింది. గత 9 రోజులులో స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన కానుకలు నగదు రూపంలో 2 కోట్ల 70 లక్షల 51 వేయి 419 రూపాయలు  ఆదాయంగా వచ్చినట్లు ఈవో యస్. లవన్న తెలిపారు.  వీటితో పాటు 995-యుఎస్ఏ డాలర్లు, 2- సౌదీ రియాద్స్, 30- న్యూజిలాండ్ డాలర్స్ మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మ వార్లకు మొక్కులుగా భక్తులు సమర్పించినట్లు, అలాగే ఉగాది మహోత్సవాల సందర్భంగా కన్నడ భక్తులు ఎక్కువగా రావడంతో తొమ్మిది రోజులకే ఈ హుండీ ఆదాయం వచ్చినట్లు లవన్న తెలిపారు.  హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News