Thursday, September 19, 2024
HomeదైవంSrisailam: అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్రీయ సాధు సంత్ సమ్మేళనం

Srisailam: అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్రీయ సాధు సంత్ సమ్మేళనం

శ్రీశైల క్షేత్రంలో గురుసదన్ లో అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సాధు సంత్ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ధర్మ సంస్థాన్ జాతీయ కార్యదర్శి శ్రీ యోగి అతిదేశ్వరానంద పర్వత స్వామీజీ తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి అన్ని రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని, హిందూ ధార్మిక, జీవన పద్ధతి విధానాలపై ఉపన్యసిస్తారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వాహకులు చేపట్టే ధార్మిక కార్యక్రమాల్లో మమేకమై, ధర్మ ప్రచారం నిర్వహించటమే ప్రధాన ఉద్దేశ్యమని, దేశ భక్తితో పాటు, హిందూ సనాతన ధర్మం ను ఆచరిస్తూ, ప్రపంచానికి భారత జాతి ఆదర్శంగా ఉండేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత హిందూ మహా సభ జాతీయ అధ్యక్షులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి వ్రతదర జీయర్ స్వామీజీ, కార్యదర్శులు ధర్మేంద్ర పాండే, కమలేశ్ దాస్ మహారాజ్, రాష్ట్ర అధ్యక్షులు రామాయాణం మహేశ్ స్వామీజీ, మిషన్ మోడీ (RSMMB ) జాతీయ అధ్యక్ష్యులు రాం విలాస్ దాస్ వేదాంతి, అయోధ్య రామ మందిరం లీగల్ అడ్వైజర్ రాం నారాయణ దాస్ మరియు ప్రముఖులు పాల్గొంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News