Saturday, September 28, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలం హుండీ ఆదాయం 5 కోట్ల పైమాటే

Srisailam: శ్రీశైలం హుండీ ఆదాయం 5 కోట్ల పైమాటే

13 రోజుల్లో వచ్చిన ఆదాయం..

జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.5,16,84,417/- నగదు రాబడిగా లభించింది. ఇందులో ఆలయ హుండీల ద్వారా రూ.5,08,66,006/-లు మరియు అన్నప్రసాద వితరణ హుండీ 8,18,411/- ( . 5,16,84,417/-0) కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 13 రోజులలో (28.02.2024 నుండి 11.03.2024 వరకు) సమర్పించారు. అదేవిధంగా అన్నదానం హుండీ రాబడి డిసెంబరు 13వ తేది నుండి మార్చి 11వ తేదీ వరకు సమర్పించారు. అలాగే ఈ హుండీలో 122 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారు, 5 కేజీల 900 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 240 – యుఎస్ఏ డాలర్లు, 25 సింగపూర్ డాలర్లు 2 మలేషియా రింగిట్స్, 30 – ఆస్ట్రేలియా డాలర్లు 30 యుకే పౌండ్సు, 20- యుఏఈ దిర్హమ్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు.

- Advertisement -

ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి శ్రీ డి. పెద్దిరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శ్రీమతి ఆర్. రవణమ్మ, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News