Saturday, October 5, 2024
HomeదైవంSrisailam: దసరా మహోత్సవాలకు జగన్ కు ఆహ్వానం

Srisailam: దసరా మహోత్సవాలకు జగన్ కు ఆహ్వానం

ఈనెల 15-24 వరకు శ్రీశైలంలో దసరా ఉత్సవాలు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీశైల దేవస్ధానం దసరా మహోత్సవాలకు ఆహ్వనించారు డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి.

- Advertisement -

ముఖ్యమంత్రికి ఆహ్వన పత్రికతో పాటు ప్రసాదాలు అందజేసిన అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 24 వరకు దసరా మహోత్సవాలు శ్రీశైలంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో పెద్దిరాజు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News