Saturday, September 21, 2024
HomeదైవంSrisailam: మల్లన్న భక్తులకు వడ ప్రసాదం

Srisailam: మల్లన్న భక్తులకు వడ ప్రసాదం

గతంలో ఆగిన వడను మళ్ళీ భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఈవో లవన్న

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులకు సౌకర్యార్ధం దేవస్థానం వడ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రసాదాల విక్రయ కేంద్రాల ద్వారా లడ్డు, పులిహోర ప్రసాదాలతో పాటు ఇక నుండి భక్తులు వడ ప్రసాదాన్ని కూడా కొనుగోలుకు దేవస్థానం ఈవో లవన్న అందుబాటులోకి తెచ్చారు.

- Advertisement -

45 గ్రాముల గల ఈ వడ ప్రసాదం ధర రూ 20 లుగా దేవస్థానం నిర్ణయించింది. గతంలో వడను దేవస్థానం విక్రయించిన అనువార్య కారణాలవల్ల నిలుపుదల చేసింది. తిరిగి మళ్లీ వడ ప్రసాద విక్రయం ప్రారంభం సందర్భంగా ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపటానికి పూజాదికాలు జరిపి, వడ ప్రసాద విక్రయాలు ఈవో లవన్న ప్రారంభించారు. అయితే ఈ వడను దేవస్థానం ఈవో ఎస్.లవన్న స్వయంగా కొనుగోలు చేసి విక్రయాలను ప్రారంభించారు. ఈవో లవన్న మాట్లాడుతూ భక్తుల రద్దీకనుగుణంగా ఎప్పటికప్పుడు వడ ప్రసాదాలను తయారు చేస్తూ భక్తులకు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో లవన్న ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News