Saturday, June 7, 2025
HomeదైవంBakrid: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Bakrid: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

ముస్లిం సోదర సోదరీమణులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

“ఈద్ ఉల్ – అధా (Bakrid) పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.” అని సీఎంవో కార్యాలయం పేర్కొంది.

“హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ‘ఈద్ ముబారక్’. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు అవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోంది. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులుగా చెప్పవచ్చు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని ‘బక్రీద్’ సందర్భంగా కోరుకుంటున్నాను.” అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News