Thursday, July 4, 2024
HomeదైవంThalakondapalli: కమనీయం..రమణీయం స్వామి వారి కళ్యాణం

Thalakondapalli: కమనీయం..రమణీయం స్వామి వారి కళ్యాణం

400 సంవత్సరాల చరిత్ర గల గుడి..

దైవచింతనతోనే ప్రజలకు ముక్తి లభిస్తుందని బిఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్.ఎస్ ప్రావీణ్ కుమార్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం వైభోగపేతంగా గూడ నరసింహ శర్మ, ఆదిత్యుని మురళీధర శర్మల వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పచ్చటి తోరణాలు, మంగళ వాయిద్యాలతో కమనీయం..రమణీయం శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు.

- Advertisement -

స్వామివారి కల్యాణంలో భాగంగా స్వామి వారికి పట్టు వస్త్రాలంకరణలు, పూలు, పండ్లలను తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్-ఉప్పల మంజుల మరియు ఉప్పల మేఘన-ఆఖీల్ పుణ్య దంపతులు వస్త్రాలు సమర్పించారు.వేద పండితుల మధ్య జరిగే స్వామి వారి కళ్యాణంలో పుణ్య దంపతులు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్-ఉప్పల మంజుల మరియు ఉప్పల మేఘన-అఖిల్‌ పుణ్య దంపతులు కూర్చుని స్వామి వారి కళ్యాణాన్ని జరిపించారు. అంతకు ముందు ఆలయమంతా చూడముచ్చటగా కలర్ కలర్ లైట్లతో, రకరకాల పూలతో, పచ్చటి తోరణాలతో అలంకరించి స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. ఈ కళ్యాణాన్ని చూడడానికి వివిధ గ్రామాల నుండి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్‌కర్నూల్ బిఆర్ఎస్‌ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్.ఎస్ ప్రావీణ్ కుమార్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలోనే మనశ్శాంతి లభిస్తుందని వాటికి నిదర్శనమే మన తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వేంకటేశ్ అనీ వారు పేర్కొన్నారు‌.

తలకొండపల్లి మండల కేంద్రము నుండి ఒక కిలోమీటర్ దూరంలో 400 సంవత్సరాల చరిత్ర గల శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వెలుశాడనీ పూర్వీకులు చెప్పేవారనీ స్థానికులు పేర్కొన్నారు.అలాంటి దేవాలయాన్ని పునర్నిర్మానంతో నూతన వరవడికను సృష్టిస్తూ 4కోట్ల రూపాయలతో మండలంలో ఒక గొప్ప నాందికి శ్రీకారం చుట్టిన ఉప్పల వెంకటేశుని నాయకులు అభినందించారు. ప్రజలందరూ భక్తి భావంతోనే ముక్తి లభిస్తుందని నాయకులు ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో తలకొండపల్లి తహసీల్దారు కెవి రంగారెడ్డి,ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్,మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ,మండల రికార్డు ఇన్‌స్పెక్టర్ మంజుల,డిటి శ్రీనివాస్,మాజి ఎంపిటీసి శ్రీనివాసమూర్తి,కల్వకుర్తి బిఆర్ఎస్‌ నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్,సీనియర్ లాయర్లు శర్మ చారి,ఆంజనేయులు గౌడ్,మాజీ సర్పంచ్‌లు లలితజ్యోతయ్య,మణెమ్మ యాదయ్య,తాజా మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్,నాయకులు జగతయ్య,నరసింహ రెడ్డి,మోహన్ రెడ్డి,రవి,సింగిల్ విండో డైరెక్టర్ కటికల శేఖర్ యాదవ్,వార్డ్ మెంబర్స్ ఈశ్వర్,దశరథం,నాయకులు శంకర్ గుప్తా,ఉప్పల వెంకటేష్ మిత్రమండలి యువ నాయకులు విజయ్ కుమార్,సంపత్ కుమార్,విట్టల్,కోర్ర కృష్ణ నాయక్,నరసింహ,వెంకటేష్,నవీన్ గుప్త,మనోహర్,నరసింహ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News