Sunday, November 16, 2025
HomeదైవంTirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే..?

తిరుమల(Tirumala) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతంతో పాటు వరుస సెలవులు రావడటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 64,279 మంది భక్తులు దర్శించుకోగా.. 24,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad