Monday, May 19, 2025
HomeదైవంTirupathi Padmavathi Ammavaru: శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం

Tirupathi Padmavathi Ammavaru: శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం

వర్చువల్ కల్యాణం అయ్యాక 90 రోజుల్లో అమ్మవారి దర్శనానికి అనుమతి

రుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ప్ర‌తి రోజు నిర్వ‌హించే అమ్మ‌వారి క‌ల్యాణోత్స‌వంలో భ‌క్తులు వ‌ర్చువ‌ల్‌గా పాల్గొనే అవ‌కాశం టీటీడీ క‌ల్పిస్తోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు ఈ టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది . రూ.500/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. వ‌ర్చువ‌ల్ టికెట్లు పొందిన భ‌క్తులకు టికెట్టు పొందిన తేదీ నుండి 90 రోజులలోపు గృహస్తులను అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. వీరికి ఒక ఉత్త‌రియం, ర‌విక‌, ల‌డ్డూ, వ‌డ ప్రసాదంగా అందిస్తారు. సుదూర ప్రాంతాల నుండి తిరుచానూరు వ‌చ్చి అమ్మ‌వారి క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన లేని భక్తుల కోసం టీటీడీ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్ర‌వేశ‌పెట్టింది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకుని అమ్మ‌వారి కృప‌కు పాత్రులు కావాల‌ని టీటీడీ కోరుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News