Tuesday, February 17, 2026
HomeదైవంYashoda Jayanti 2026: యశోద జయంతి ఎప్పుడు? పిల్లలు కలగాలంటే ఏం చేయాలి?

Yashoda Jayanti 2026: యశోద జయంతి ఎప్పుడు? పిల్లలు కలగాలంటే ఏం చేయాలి?

Yashoda Jayanti 2026: సనాతన ధర్మంలో తల్లి మరియు సంతానం మధ్య ఉండే నిస్వార్థ ప్రేమానురాగాలకు ‘యశోదా-కృష్ణుల’ బంధం ఒక గొప్ప నిదర్శనం. శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినప్పటికీ, లోకమంతా ఆయన్ని ‘యశోదానందనుడు’గానే కొలుస్తుంది. భగవంతుడినే పెంచి పెద్ద చేసిన ఆ మాతృమూర్తి పుట్టినరోజే ‘యశోద జయంతి’. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష షష్ఠి తిథి నాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. 2026లో యశోదా జయంతి ఎప్పుడు? ముహూర్తం మరియు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

తేదీ మరియు శుభ ముహూర్తం
వైదిక పంచాంగం ప్రకారం, ఈ ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష షష్ఠి తిథి 06 ఫిబ్రవరి 2026, అర్థరాత్రి 01:18 గంటలకు ప్రారంభమై.. 07 ఫిబ్రవరి 2026, అర్థరాత్రి 02:54 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని ఆధారంగా చేసుకుని యశోద జయంతిని ఫిబ్రవరి 7 (శనివారం) నాడు జరుపుకోవాలి. ఈ రోజే తల్లులు తమ సంతానం కోసం వ్రతాన్ని ఆచరించాలి.

ఈ వ్రతం విశిష్టత ఏమిటి?
యశోద జయంతి వ్రతం ముఖ్యంగా తల్లులు ఆచరిస్తారు. ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో, వారు ఈ రోజు యశోదమ్మను వేడుకుంటే త్వరలోనే ఫలితం ఉంటుందని నమ్మకం. తమ పిల్లలు ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకునే మాతలు కూడా ఈ రోజు వ్రతం ఆచరిస్తారు.

Also Read: Phalguna Amavasya 2026 -ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?

పూజా విధానం
యశోద జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. యశోదమ్మ ఒడిలో ఉన్న బాలకృష్ణుని విగ్రహాన్ని లేదా ఫోటోను గంగాజలంతో అభిషేకించాలి. తల్లి యశోదకు ఎర్రటి చున్నీని సమర్పించి, కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న-మిఠాయి (మాఖన్-మిశ్రీ), పంజీరిని నైవేద్యంగా పెట్టాలి. పూజ సమయంలో ‘సంతాన గోపాల మంత్రాన్ని’ పఠించాలి. అది వీలుకాకపోతే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజు ఆవుకు సేవ చేయడం అత్యంత పుణ్యప్రదం. ఇంటి వద్దకు వచ్చే ఆవుకు (ముఖ్యంగా నల్ల ఆవుకు) బెల్లం, రొట్టె లేదా పచ్చగడ్డిని తినిపించాలి.

Also read: Phulera Dooj 2026-అదృష్టాన్నిచ్చే ‘ఫులేరా దూజ్’.. ఎప్పుడో తెలుసా?

పరిహారం: ఒక మర్రి ఆకుపై సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేసి, దానిపై కొంచెం అక్షింతలు, పోకచెక్క ఉంచి ఆలయంలో సమర్పించాలి. ఇది సంతాన ప్రాప్తికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని భక్తుల నమ్మకం.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News