పుట్టుక నుంచి మరణం వరకు.. హిందూ ధర్మంలో ప్రతిదానిలో కొన్ని ఆచారాలను పాటిస్తారు. ఇంట్లో బిడ్డ పుడితే కుటుంబం పెరిగిందని.. వేడుకలు చేసుకుంటారు. శిశువుకు నామకరణం, ఊయల, అన్నప్రాశన, ఉపనయనం, వివాహం.. ఇలాగే కొత్త వ్యాపారం, కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు వంటి ప్రతి శుభకార్యానికి కొన్ని పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా గరుడ పురాణం ప్రకారం.. ఒక ఇంట్లో బిడ్డ పుట్టిన తర్వాత సూతకాన్ని జరుపుకున్నట్లే.. ఒక సభ్యుడు మరణించిన ఇంట్లో సూతకం ఉంటుంది. మరణించిన తరువాత, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు 13 రోజుల పాటు సూతక్ నియమాలను పాటించాలి.
ముఖ్యంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ గాలిలో కలుస్తుందని నమ్ముతారు. ఇలా శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మ ఉత్తమ లోకాలకు చేరాలన్నా.. చనిపోయిన వారికి మోక్షానికి అవసరమైన అనేక ఆచారాలను నిర్వహిస్తారు.. దీని కారణంగా ఆత్మ ఉన్నత లోకాలకు చేరుతుందని నమ్ముతారు. ఇక ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరైనా మరణించినప్పుడు.. కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెపుతుంటారు. ఆ సమయంలో కొత్త వస్తువులు వాడటం, కొట్ట బట్టలు ధరించడం, పిండివంటలు చేయడంపై నిషేధం ఉంటుంది. అదే సమయంలో కేశ ముండనంపై కూడా నియమాలు ఉన్నాయి.
నిజానికి జుట్టు భౌతిక ప్రపంచానికి ముడిపడి ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ప్రియమైన వ్యక్తి మరణించిన తరువాత, వారి కోసం దుఃఖం లేదా విచారం వ్యక్తం చేయడానికి గుండు చేస్తారు. దీని కారణంగా వారి వ్యక్తి దృష్టి కొన్ని రోజుల పాటు ప్రాపంచిక ప్రయోజనాల నుండి మళ్లించబడుతుంది. మరణించిన వారికి గౌరవం, సంతాపం తెలియజేయడానికి గుండు చేయిస్తారు. గరుడ పురాణం ప్రకారం తల క్షౌరము చేసిన తర్వాత సూతకము ముగుస్తుంది. ఇక జుట్టు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆత్మతో శరీర సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే సాధనం అని నమ్ముతారు. అంటే మరణించిన వ్యక్తి అంత్యక్రియల తర్వాత 13 రోజులు.. అతను తన కుటుంబంతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. జీవితంతో ఉన్న అన్ని సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి మరణానంతరం కేశ ముండనం చేయాలి అని చెబుతారు.
దీనికి మరో కారణం కూడా ఉంది. మరణానంతరం పరిశుభ్రతపై మరింత శ్రద్ధ వహించాలి. చనిపోయిన వారి చుట్టూ లేదా స్మశానవాటికలో అనేక రకాల బ్యాక్టీరియా ఉన్నాయి.. కాబట్టి వాటిని నివారించడానికి అనేక నియమాలు పాటిస్తారు. పరిశుభ్రత, పవిత్రతను కాపాడుకునే ఈ నియమాలలో గుండు చేస్తారంట.