Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Bonalu: తెలంగాణలో బోనాల పండుగ

Bonalu: తెలంగాణలో బోనాల పండుగ

బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు

శ్లో॥ ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే
భాయెభ్య స్త్రహి నో దేవి దుర్గా దేవి నమోస్తుతే॥
మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పం డుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్‌), లస్కర్‌ (సికింద్రాబాద్‌) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగ రంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభు త్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంబమై తరువాత సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగాను నిర్వహిస్తారు ఆతరువాత చివరగా లాల్‌ దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర చోట్ల నిర్వహిస్తారు ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు. బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాము.

- Advertisement -


బోనాల పండుగకు శాస్త్రీయ కారణాలు…
బోనం

బోనం అంటే భోజనం అని అర్ధం. ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేజ్యంగా పెట్టడం ఆచారంగా వస్తున సంప్రదాయం.ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండు తారు ఆలావండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపా కులు కూడా పెడ్తారు అలాగే ఆ కుండాపై ఒక దీపాన్ని ఉంచు తారు. ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభ్ర మైనది కూడా. అలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు. ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్‌, యాంటీ బైయోటిక్‌కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత, శుభ్రత ఉం టుంది. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు త్రోవ్వ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట. ఇది బోణం యొకా ప్రత్యేకత.


ఆషాఢ మాసంలో పండుగ ఎందుకు చేస్తారు
మనకు ముఖ్యంగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలం లో మనకు కలరా, మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి. వానా కాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం. సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ, శ్రావన మసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహి ళలకు అరి కాళ్ళు చెడుతయీ అలా కాకుండా మహిళలు పసుపు ను కాళ్ళకు పెట్టుకుంటారు.
అసలు పండగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడ్తారు కనుక ఆ వేపాకులో ఉండే గుణ్ణం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ పండుగ లో వేపాకులు ప్రదానంగా వాడుతారు. వేపాకులో ఉన్న గుణ్ణం వల్ల ఎటువంటి అంటూ వ్యాధులు మనకు రావు.

బలి
బోనాల పండుగలో ముఖ్యమైనది బలి. ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు. ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సాధా రణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలైయే వానా కాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేక లకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు. బహుశా అందువలననేమో శ్రావణ మాసంలో కొంత మంది మాంసా హారం తినరు.
అమ్మవారి ఊరేగింపు
బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరే గింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు. ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు. అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకర మైన జంతువులు భయంతో పారిపోతాయి.

గుగ్గీలం లేదా మైసాచి పొగ
అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు. ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే. వానా కాలంలో దోమలు, ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి. అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు.

  • ఆలేటి రమేష్‌
    ప్రజా సంబంధాల అధికారి
    9948798982
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News