Sunday, November 16, 2025
HomeTop StoriesKonda Surekha : కొండా సురేఖ... తెరపైకి 'బీసీ' కార్డు.. తెరవెనుక 'వసూళ్ల' దందా?

Konda Surekha : కొండా సురేఖ… తెరపైకి ‘బీసీ’ కార్డు.. తెరవెనుక ‘వసూళ్ల’ దందా?

Corruption allegations against Minister’s OSD : “కాసులిచ్చుకో.. కాలుష్యం చేసుకో!” – ఇది రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB)లో ఓ ఉన్నతాధికారి నినాదంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కొండా సురేఖ పేషీలో ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేస్తున్న సుమంత్‌పై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ అధికారి అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, దానికి కులం రంగు పులమడం, “పార్టీ అంతర్గత విషయం”గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి…? అసలు సుమంత్ బాగోతమేంటి..?

- Advertisement -

తనకు చెందిన వ్యక్తిని తన కోట­రీ­లోని వ్యక్తిని ప్రభుత్వం ఏక­ప­క్షంగా తొల­గిం­చ­డాన్ని కొండా సురేఖ, ఆమె కుమార్తె సుష్మిత జీర్ణిం­చు­కో­లే­క­పో­తు­న్నారు. ప్రైవేటు ఓఎ­స్డీగా విధులు నిర్వ­హించే సుమంత్‌ చేసిన లావా­దే­వీలు జరి­పిన మంత్రాం­గాల గురించి తెలు­గు­ప్రభ ముందే బయ­ట­పె­ట్టింది. అసలు ఇటు­వంటి ఓఎ­స్డీలు ఏయే నిబం­ధ­నల ప్రకారం ఉద్యో­గంలో నియ­మిం­ప­బ­డాలి?, అలాగే వారి విధులు ఏ పరి­మి­తుల లోపల ఉండాలి అన్న అంశా­లను కూడా వరుస కథ­నాల్లో ప్రస్తా­విం­చింది. సాధా­ర­ణంగా ఆయా మంత్రులు తాము నమ్మిన వ్యక్తికి అత్యంత కీల­క­మైన బాధ్య­తలు అప్ప­గిస్తూ, తమ కార్య­క­లా­పాలు చక్క­బె­ట్టడం అనేది సాధా­రణ విషయం. కానీ, ఇక్కడ జరి­గింది అంతకు మించి. అటవీ శాఖ, పర్యా­వ­రణ శాఖ, దేవా­దాయ శాఖల్లో సుమంత్‌ తన పరి­ధిని దాటి వ్యహ­రిం­చిన విష­యాలు.. ఆయా శాఖ అధి­కా­రు­లకు ఉన్న­తా­ధి­కా­రు­లకు బహి­రం­గంగా తెలి­సిన విష­యమే. ఈ మధ్యనే రిటైర్‌ అయిన ఓ ఐఎ­ఫ్‌­ఎస్ ఉన్న­తా­ధి­కారి కార్యా­ల­యం­లోకి వెళ్లి, ఆయన సీటు­లోనే కూర్చుని, ఆయా అధి­కా­రు­లతో రివ్యూ చేసిన సంఘ­ట­నలు కూడా ఇప్పుడు అటవీ శాఖ అధి­కా­రులు ప్రస్తా­వి­స్తు­న్నారు. సీసీ కెమె­రాల్లో ఆ దృశ్యాలు ఉన్నా­యని కూడా చెబు­తు­న్నారు.  ఇంటె­లి­జెన్స్​‍ కు మొదటి ఫిర్యాదు అందిందే ఇక్కడి నుంచి అని కూడా చెబు­తు­న్నారు.  ఆ తరు­వాత వరు­స­పెట్టి పర్యా­వ­రణ సంబంధ విష­యాల్లో జోక్యం చేసు­కుంటూ, ప్రతి నెలా కాలుష్య నియం­త్రణా మండలి రాష్ట్ర కార్యా­ల­యంలో జరిగే టాస్క్‍ ఫోర్స్​‍ కమిటీ విచా­ర­ణలో జోక్యం చేసు­కున్న విషయం దగ్గరి నుంచీ ఆయా శాఖల సిబ్బంది బది­లీ­ల్లోనూ తన చేతి­వా­టంపై తీవ్ర­మైన ఆరో­ప­ణ­లు­న్నాయి.  కాలుష్య నియం­త్రణా మండలి ఆయా ఫార్మా, సిమెంట్‌ కంపె­నీల భవి­ష్యత్‌ ను నిర్ధా­రిం­చ­గ­లదు.  ఒక్క మాటలో చెప్పా­లంటే దక్కన్‌ సిమెంట్‌ కంపెనీ కానీ మరో సిమెంట్‌ కంపెనీ గానీ అలాగే రసా­యన పరి­శ్ర­మలు కానీ వారి ఉత్పత్తి క్రమంలో చట్టా­లను ఉల్లం­ఘించి పర్యా­వ­ర­ణాన్ని కలు­షితం చేయటం పీసీబీ అధి­కా­రు­లకు రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరి­కి­పో­వటం టాస్క్‍ ఫోర్స్​‍ విచా­రణ చేప­ట్టడం వారిపై తూతూ మంత్రపు చర్యలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇక్కడ పరి­పాటే. 

కాలుష్యం చేస్తూ చిక్కి­న­ప్పు­డల్లా ఆయా కంపె­నీల యాజ­మా­న్యాలు వారి­వారి స్థాయి­లను బట్టి సచి­వా­లయం కేంద్రంగా పైర­వీలు చేసు­కుంటూ పీసీబీ అధి­కా­రు­ల­పైన ఒత్తిడి పెంచి చర్యలు తీసు­కో­కుండా నిలు­వ­రి­స్తుం­టారు.  ఇది ఆయా టాస్క్‍ ఫోర్స్​‍ కమిటీ నివే­ది­క­లను పరి­శీ­లిస్తే ఏమాత్రం భాషా­ప­రి­జ్ఞానం ఉన్న­వా­రి­కైనా ఇట్టే అర్థ­మ­వు­తుంది, దాని­కోసం సాంకే­తి­కత రసా­యన శాస్త్ర పరి­జ్ఞానం అవ­సరం లేదు.  సరిగ్గా ఈ లోపాన్నే ఒడిసి పట్టిన సుమంత్‌ పీసీబీ ఉన్న­తా­ధి­కా­రుల నుంచి మొద­లు­పె­డితే పారి­శ్రా­మిక వర్గా­ల­పైన ఒత్తిడి పెంచారు.  బీఫా­ర్మసీ చది­విన సుమంత్‌ కు ఈ విషయం ఎవరూ చెప్పా­ల్సిన పని­లేదు.  తను ఆయా అధి­కా­రు­లతో, పారి­శ్రా­మి­క­వే­త్త­లతో, పరి­శ్ర­మల లైజ­నింగ్‌ సిబ్బం­దితో నెరి­పిన లావా­దే­వీలు, సంభా­ష­ణలు లోతుగా విచా­రిస్తే అవన్నీ బట్ట­బ­య­ల­వు­తాయి.  సంగా­రెడ్డి జిల్లా పటా­న్చెరు నియో­జ­క­వర్గం గడ్డ­పో­తారం పారి­శ్రా­మిక వాడలో ఓ పరి­శ్ర­మకు పీసీబీ మూసి­వేత ఉత్త­ర్వులు సిద్ధం చేయగా వాటిని అధి­కా­రు­లపై ఒత్తిడి తెచ్చి రద్దు కూడా చేసి, కాలుష్య నివా­రణా సూచ­నలు చేసే­శాడు. ఈవి­ధంగా గుమ్మ­డి­దల నల్ల­చె­రువు కేసు­లోనూ, అదే నియో­జ­క­వర్గం జిల్లె­ల­వాగు కేసు­లోనూ తన ప్రతిభ చూపాడు.  ఇదంతా ఒకె­తె­్తౖతే అరబిందో పరి­శ్ర­మపై ఎమ్మెల్యే అను­రుద్‌ రెడ్డి సోషల్‌ మీడియా వేది­కగా కాలుష్యం తగ్గిం­చ­క­పోతే కాల్చి­వే­స్తా­నన్న హెచ్చ­రిక తరు­వాత జరి­గిన పరి­ణా­మా­ల­లోనూ అయ్య­గారి ఒత్తిళ్లు అధి­కా­రు­లపై ఇప్ప­టికీ పని­చే­స్తూనే ఉన్నాయి.  అలాగే నల్గొండ కాలుష్య నియం­త్రణా మండలి ప్రాంతీయ కార్యా­లయం పరి­ధి­లోని ఫార్మా, సిమెంట్‌ కంపె­నీ­లపై తను చేప­ట్టిన “కాసు­లి­చ్చుకో కాలుష్యం చేసుకో” నినాదం అక్కడి పారి­శ్రా­మిక వాడలో పెను సంచ­లనం.  ఇవన్నీ కల­గ­లి­పిన సమా­చారం తెలు­గు­ప్ర­భకు అంశా­ల­వా­రిగా అందింది.  కాలు­ష్యంపై ఫిర్యాదు చేసిన స్థాని­కులు ఆపై కాలుష్య నియం­త్రణా మండ­లిలో దశ­ల­వా­రిగా జరి­గిన టాస్క్‍ ఫోర్స్​‍ విచా­ర­ణను సైతం కమిటీ చేప­ట్టిన నామ­మా­త్రపు చర్యల సారాంశం కూడా తెలు­గు­ప్రభ సమీ­క­రిం­చింది.  ఇంత కాలుష్యం ఓ ప్రైవేటు వ్యక్తి ఎలా చేయ­గ­ల­డ­న్నది ప్రధాన ప్రశ్న.

సుమం­త్‌పై ఎందుకీ పట్టు­దల : కాంగ్రెస్ పార్టీ క్రమ­శి­క్షణా కమి­టీకి చెందిన ఎంపీ మల్లు రవి రెండు రోజు­లుగా మంత్రి సురే­ఖపై జరు­గు­తున్న విష­యా­లన్నీ కాంగ్రెస్ అంత­ర్గ­త­మని, మా పార్టీలో ప్రజా­స్వామ్యం ఎక్కువ కనుక వారు తమ అభి­ప్రా­యా­లను మీడియా ముందు బహి­రం­గంగా ప్రక­టి­స్తా­రని సమస్య తీవ్ర­తను తక్కువ చేసి చూపారు.  ఆయన చెబు­తు­న్నట్టు ఇది కేవలం ఆ పార్టీ అంత­ర్గత వ్యవ­హా­ర­మైతే మీడియా మాట్లాడే అవ­స­రమే లేదు.  కొండా సురేఖ రాష్ట్ర మంత్రి, ఆమె వద్ద పని­చే­స్తున్న ఓఎస్డీ ప్రభుత్వ జీతం తీసు­కుని విధులు నిర్వ­హి­స్తు­న్నాడు.  మంత్రికి బదు­లుగా ఆయా శాఖల అధి­కా­రు­లతో రివ్యూలు చేస్తూ­వ­చ్చాడు.  ఇలా చేసిన క్రమం­లోనే కోట్ల రూపా­యల తప్పి­దాలు జరి­గా­యని ఆరో­ప­ణలు ఎదు­ర్కొం­టు­న్నాడు.  ప్రజ­లకు నిఖా­ర్సైన పరి­పా­లన అందిం­చటం కోసం ప్రమాణం చేసిన ఈ మంత్రి కాంగ్రెస్ పార్టీ అంత­ర్గత విషయం ఎలా అవు­తుంది.  బాధ్యత గల మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డక్కన్‌ సిమెంట్‌ కంపె­నీకి సంబం­ధిం­చిన విష­యంపై పోలీ­సు­లకు మౌఖిక ఫిర్యాదు చేసి­నట్టు తెలు­స్తోంది.  అప్ప­టికే తెలు­గు­ప్రభ సుమంత్‌ వ్యవ­హా­రాన్ని పతాక శీర్షి­కలో ప్రచు­రిం­చింది.  అలాగే ఇంటె­లి­జెన్స్​‍ నివే­ది­కలు ప్రభు­త్వా­నికి చేరాయి. ఒక వ్యక్తి చేస్తున్న అక్ర­మా­లపై నియ­మిం­చిన శాఖ చర్యలు తీసు­కుంటే అది కాంగ్రెస్ పార్టీ వ్యవ­హారం ఎలా అవు­తుంది?  అంటే పరో­క్షంగా సుమంత్‌ లాంటి వ్యక్తు­లను అధి­కార పార్టీ ప్రోత్స­హి­స్తోం­దని పరో­క్షంగా ప్రజ­లకు చెప్ప­ద­ల­చు­కు­న్నారా అని తెలం­గాణ సమాజం ఇప్పుడు సోషల్‌ మీడియా వేది­కగా ప్రశ్ని­స్తోంది.  

బీసీ ఎవరు : సుమంత్‌ ను విచా­రణ కోసమో, అరెస్టు చేయటం కోసమో తెలి­యదు కానీ బుధు­వారం రాత్రి మంత్రి ఇంటికి టాస్క్‍ ఫోర్స్​‍ పోలీ­సులు వచ్చి­న­ప్పుడు మంత్రి కుమార్తె సుష్మిత పోలీ­సు­లతో వాగ్వాదం చేశారు.  తాను మీడియా వేది­కగా వేం నరేం­దర్‌ రెడ్డి మొదలు నల్గొండ జిల్లాకు చెందిన అనేక మంది పేర్లు ప్రస్తా­విస్తూ మాపై కుట్ర జరు­గు­తోం­దని ఆరో­పిం­చారు.  రెడ్లు మా బీసీ­లను తొక్కే­స్తు­న్నా­రంటూ ఇక్కడ ఓ కులాన్ని కుల­చిచ్చు రేప­డా­నికి ప్రయ­త్నిం­చారు.  అసలు 14వ తేదీ రాష్ట్ర కాలుష్య నియం­త్రణా మండలి సుమంత్‌ ను విధుల నుంచి తొల­గిస్తూ ఉత్త­ర్వులు జారీ చేశాక జరి­గిన పరి­ణా­మాలే ఇవన్నీ.  ఇంతకీ సుమంత్‌ ఎవరు సుమంత్‌ బీసీనా అని విచా­రణ చేస్తే కళ్లు బైర్లు­కమ్మే విష­యాలు బయ­ట­ప­డ్డాయి.  బీసీ పదా­నికి, సుమంత్‌ కు సంబంధం లేదు.  సుమంత్‌ ఇంటి­పేరు నార్ల.  సుమంత్‌ తల్లి­దం­డ్రులు నార్ల సుబ్ర­హ్మణ్యం, నార్ల సుగు­ణలు.  తండ్రి రిటైర్డ్‍ విద్యుత్‌ ఉద్యోగి. వీరిది కమ్మ కులం. ఈ కుటుంబం ఆంధ్రా నుంచి వలస వచ్చిన కుటుంబం. ఇప్పుడు ఇక్కడ బీసీ సామా­జిక వర్గం ఎక్కడి నుంచి వచ్చింది. పారి­శ్రా­మి­క­వే­త్త­లను కాలుష్యం పేర అటవీ శాఖ అధి­కా­రు­లను బదిలీ పేర దేవా­దాయ శాఖ ఉద్యో­గు­లను రక­ర­కాల వేధిం­పు­లతో ఆ మంత్రి పేషీనే గబ్బు పట్టిం­చిన సుమంత్‌ కోసం ఎందుకు కొండా సురేఖ అంత తాప­త్రయ పడు­తు­న్నా­ర­న్నది ఇక్కడ మిలి­యన్‌ డాలర్ల ప్రశ్న. 

లోగుట్టు ఇదీ : అందు­బా­టులో ఉన్న ఓ సమా­చారం ప్రకారం సుమంత్‌ తొలి రోజుల్లో ముందూ వెనకా చూసు­కో­కుండా కొందరు పారి­శ్రా­మిక వేత్త­ల­తోటి తాను సాగిం­చిన సంభా­షణ ప్రకారం ఇదంతా తాను చేస్తోంది మంత్రి కోసం అంటూ చెప్పు­కు­న్నారు.  కొన్ని చోట్ల ఆయా వర్గాలు వీటిని అత్యంత చాక­చ­క్యంగా రికార్డు చేసి­నట్టు కూడా సమా­చారం.  ఇప్పుడు వీటిని బయ­ట­పె­డితే మీ అంతు చూస్తా­మంటూ కొండా వర్గీ­యులు బాహా­టం­గానే బెది­రిం­పు­లకు దిగు­తు­న్నారు.  ఇక్కడ చూస్తే తప్పు చేసిన వ్యక్తిని ప్రభుత్వం తొల­గిం­చింది.  దీన్ని ఇక్క­డతో మంత్రి వది­లి­పెట్టి ఉంటే విషయం మరోలా మనకు అర్థ­మ­య్యేది.  కానీ కొండా సురేఖ కుటుంబం యావత్తూ దీన్ని చాలా వ్యక్తి­గ­తంగా తీసు­కో­వ­టం­తోనే అను­మా­నా­లకు తావి­స్తోంది.  కాబట్టి దీనిపై ప్రత్యేక సిట్‌ విచా­రణ జరిపి, ఆ శాఖలో జరి­గిన కలు­షిత లెక్కలు కాలుష్యం పేరు­మీద జరి­గిన వసూ­ళ్లను, పీసీబీ రికా­ర్డు­లను పరి­శీ­లించి చర్యలు తీసు­కో­వా­లని కాంగ్రెస్ వర్గా­ల్లోనే విన­ప­డు­తుం­డటం విశేషం. 

భగ్గు­మం­టున్న బీసీ సంఘాలు : బీసీల రిజ­ర్వే­షన్లు, బీసీ సాధి­కా­రత కోసం ఒక­వైపు బీసీ­లంతా పార్టీ­ల­క­తీ­తంగా ఐక్య­మ­వు­తుంటే ఈ మంత్రేంటి బీసీ నినా­దాన్ని తన స్వార్థ ప్రయో­జ­నా­లకు వాడు­తు­న్నా­రన్న వాద­నలు విని­పి­స్తు­న్నాయి.  సుమంత్‌ అక్ర­మా­లను దాచి­పె­డు­తు­న్నా­రంటే ఆయన అక్ర­మాల్లో పాలు­పం­చు­కు­న్నట్టే అని బీసీ నేతలు విమ­ర్శి­స్తు­న్నారు. ప్రస్తుతం తారా­స్థా­యికి చేరు­కున్న బీసీ ఉద్య­మాన్ని ఇలాంటి వ్యక్తుల ప్రవ­ర్తన నీరు­గార్చే ప్రమా­ద­ముం­దని ఆందో­ళన చెందు­తు­న్నారు.  తమ సామా­జిక వర్గా­నికి మచ్చ తెచ్చే ఇలాంటి చర్యలు ఖండి­స్తు­న్నా­మని బీసీ నేతలు చెబు­తు­న్నారు.


సెటిల్‌ చేస్తా­మని పార్టీ  పెద్దలు చెప్పారు: కొండా సురేఖ : ‘గత కొన్ని రోజు­లుగా నాకు సంబం­ధించి చోటు­చే­సు­కుం­టున్న పరి­ణా­మా­లను గురు­వారం సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ­హా­రాల ఇన్‌­చార్జి మీనాక్షి నట­రా­జన్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు వివ­రించా. పోలీ­సులు వచ్చిన సమ­యంలో చోటు­చే­సు­కున్న డ్రామాను కూడా తెలి­య­చేశా. నా సమస్య పరి­ష్క­రిం­చేం­దుకు ప్రయ­త్ని­స్తా­మని వారు హామీ ఇచ్చారు. సెటిల్‌ చేస్తా­మని పార్టీ పెద్దలు చెప్పారు. మిగి­లిన విష­యాలు వారే చూసు­కుం­టా­రని భరో­సాతో వెళ్తున్నా’ అని చర్చల అనం­తరం మంత్రి సురేఖ మీడి­యాతో అన్న­మా­ట­లివి. ఈ మాటలు బట్టి ఆమె సమ­స్య­లేంటో, కాంగ్రెస్ పెద్దలు ఏం సెటిల్‌ చేస్తా­మ­న్నారో అది ఆమెకు, ఆ పార్టీ పెద్ద­లకే తెలి­యా­లని సామా­న్యులు చర్చిం­చు­కుం­టు­న్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad