గద్దర్ ఒక విప్లవ సంకేతం. ఆయన పురోగామి ప్రగతిశీల భావజాలం ఆరుదశాబ్దాలను నడిపించింది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలను ఆయన ప్రభావితం చేశాడు. గద్దర్ బతికి వుండే కాలంలో జీవించినవాళ్లంతా గర్వపడ్డారు. ఆయన మరణానంతరం జాతీయ, అంతర్జాతీయ సమాజం దిగులు చెందింది. ఆ మహావాగ్గేకారుడికి సామాన్య జనం మొదలు సెలబ్రిటీల వరకు అందరూ కన్నీటి నివాళి అర్పించారు. ఆయన తన జీవిత చరమాంకంలో కూడా పెట్రేగిపోతున్న ఫాసిస్టు శక్తులను నిలువరించే పాటలే పాడారు. ఫ్యూడల్ పాలకుడైన కేసిఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. రాజ్యాంగ వ్యతిరేకమైన బిజెపిని నిలువరించడానికి రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్నాడు.
లౌకికవాదం, ప్రజాస్వామ్యం సజీవంగా కొనసాగాలి అంటే ఫాసిస్టు శక్తులు ఎన్నికల్లో ఓడిరచాలని పిలుపునిచ్చాడు. ఆయన మరణానంతరం రేవంత్ రెడ్డి నంది అవార్డులను ఇక నుంచి గద్దర్ అవార్డులుగా ఇస్తామని ప్రకటించాడు. ఆ ప్రకటన పట్ల సానుకూల, ప్రతికూల స్పందనలు వ్యక్తమయ్యాయి. దిల్ రాజు సారధ్యంలో ఒక జ్యూరీ ఏర్పడ్డది. ఆ జ్యూరీ ప్రకటించిన నిర్ణయం గద్దర్ అభిమానులనే కాదు, యావత్ తెలుగు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హెరిటేజ్ కేటగిరిలో రజాకార్ సినిమాకు గద్దర్ అవార్డు ప్రకటించడం, మనువాద భావజాలానికి ప్రతీక అయిన కల్కి సినిమాకు అవార్డు ప్రకటించడం ఎవరూ అంగీకరించలేరు.
రజాకార్ సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు ఇస్తుందని ఊహించలేదు. ఆ సినిమా తెలంగాణ చరిత్రను వక్రీకరించడమే కాదు, అది విషపూరితమైన విద్వేషాన్ని ప్రచారం చేసింది. ముస్లిం సమాజాన్నిఅనుమానించేలా, అవమానించేలా ఆ సినిమా వుందని విమర్శకులు తీవ్రమైన అభ్యంతరాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మత సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతున్నది. రేవంత్ రెడ్డి విధానం లౌకిక విధానానికి విరుద్ధంగా వుంది.
తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక ఉద్యమంగా పేరుపొందింది. ఉద్యమంలో అన్ని రంగాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతుండడాన్ని ఉద్యమకారులు ఎత్తిచూపారు. తెలంగాణ వచ్చాక గడిచిన పదకొండు ఏళ్లలో తెలంగాణ సినిమా ఎదుగుదల గురించి పట్టించుకున్నది లేదు. తెలంగాణ సినీ పాలసీని రూపొందించినది కూడా లేదు. దాంతో తెలంగాణ నుంచి సినిమాలు రూపొందడం కష్టమైన వ్యవహారంగా మారింది. నిర్మాతలంతా ఆంధ్రా ప్రాంతం వారే కావడంతో తెలంగాణ సినిమా ఎదిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ అవార్డుల వ్యవహారం గందరగోళాన్ని సృష్టిస్తున్నది.
ఎలాంటి సినిమాలకు అవార్డులు ఇచ్చారనేది చర్చనీయాంశమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పైనే తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ‘‘నఫ్రత్ కే బాజార్ మే మొహబ్బత్కీ దుకాన్ ఖోల్ రహా హూ’’ (విద్వేషపు సంతలో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నాను) అని ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ తెలంగాణలో రేవంత్రెడ్డి ఒక విద్వేషపు సినిమాకు అవార్డు ప్రకటించడం ద్వారా విద్వేషం పెంచే పనిలో ఉన్నాడా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్సుకు అవకాశమిస్తే సెక్యులర్ భావజాలాన్ని పెంపొందించే పని వదిలేసి ఒక మతోన్మాద, అబద్ధపు చరిత్ర వక్రీకరణలకు మద్దతు పలికే సినిమాకు అవార్డు ఇవ్వడం సిగ్గుచేటు. ఇది కాంగ్రెస్ పార్టీకి తలవంపులు తెచ్చే చర్య. నమ్మిన ప్రజలను మోసగించడమిది. అబద్ధపు చరిత్ర తెరకెక్కించిన సినిమాకు అవార్డు ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందా?
బిజెపి మూడోసారి అధికారంలోకి రావడానికి సినిమా రంగాన్ని ఒక పావుగా ఎంచుకున్నది. వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి హిందీతోపాటు, ఇతర ప్రాంతీయ భాషల్లో అది సినిమాలు తీయించింది. వాటిలో అబద్దాలు, ముస్లిం వ్యతిరేకత, విద్వేషం తప్పా, నిజాలేవీ లేవు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్ వంటి సినిమాలు అలా బిజెపి ప్రొడక్షన్లో వచ్చినవే అన్నది నిర్వివాదాంశం. సంఫ్ు పరివార్ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ క్రియాశీల పాత్ర పోషించిన దాఖలాలు లేవు. భూస్వాములకు, జమీందారులకు వత్తాసు పలుకుతూ ఆనాటి హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, ఆర్యసమాజం తిరోగమన పాత్ర పోషించింది. సంస్థానాలు స్వతంత్రంగా వుండాలని, ఆ రాచరిక వ్యవస్థలోనే హిందువులు సుఖంగా వుంటారని భావించిన సంస్థలవి. అందుకే ఖమ్మం, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మెదక్ ప్రాంతాలలో భూస్వాముల పరిరక్షణ కోసం ఈ సంస్థలు పనిచేశాయి. కమ్యూనిస్టులను అంతం చేసే హింసాత్మక చర్యలకు రజాకార్లకు ఈ సంస్థలే సహాయ సహకారాలు అందించాయి. కానీ, బిజెపి ప్రాయోజిత సినిమాల్లో ఈ వాస్తవాలు దాచిపెట్టి, ముస్లింల మీద అకారణమైన విద్వేషాన్ని చిమ్ముతూ సమాజాన్ని నిలువునా చీల్చే కుట్రలకు తెరలేపాయి.
రజాకార్ సినిమా ఒక మతోన్మాద సినిమా. అది తెలంగాణ చరిత్రను వక్రీకరించడమే. అలాంటి సినిమాకు గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం అవమానకరం. గద్దర్ ఒక విప్లవ సంకేతం. ఆయన పురోగామి ప్రగతిశీల భావజాలం ఆరుదశాబ్దాలను నడిపించింది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలను ఆయన ప్రభావితం చేశాడు. గద్దర్ బతికి వుండే కాలంలో జీవించినవాళ్లంతా గర్వపడ్డారు. ఆయన మరణానంతరం జాతీయ, అంతర్జాతీయ సమాజం దిగులు చెందింది. ఆ మహావాగ్గేకారుడికి సామాన్య జనం మొదలు సెలబ్రిటీల వరకు అందరూ కన్నీటి నివాళి అర్పించారు. ఆయన తన జీవిత చరమాంకంలో కూడా పెట్రేగిపోతున్న ఫాసిస్టు శక్తులను నిలువరించే పాటలే పాడారు. ఫ్యూడల్ పాలకుడైన కేసిఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. రాజ్యాంగ వ్యతిరేకమైన బిజెపిని నిలువరించడానికి రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్నాడు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం సజీవంగా కొనసాగాలి అంటే ఫాసిస్టు శక్తులు ఎన్నికల్లో ఓడిరచాలని పిలుపునిచ్చాడు. ఆయన మరణానంతరం రేవంత్ రెడ్డి నంది అవార్డులను ఇక నుంచి గద్దర్ అవార్డులుగా ఇస్తామని ప్రకటించాడు. ఆ ప్రకటన పట్ల సానుకూల, ప్రతికూల స్పందనలు వ్యక్తమయ్యాయి. దిల్ రాజు సారధ్యంలో ఒక జ్యూరీ ఏర్పడ్డది. ఆ జ్యూరీ ప్రకటించిన నిర్ణయం గద్దర్ అభిమానులనే కాదు, యావత్ తెలుగు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హెరిటేజ్ కేటగిరిలో రజాకార్ సినిమాకు గద్దర్ అవార్డు ప్రకటించడం, మనువాద భావజాలానికి ప్రతీక అయిన కల్కి సినిమాకు అవార్డు ప్రకటించడం ఎవరూ అంగీకరించలేరు. అబద్ధపు ప్రచారానికి అవార్డు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ కూడా ఆ ప్రచారానికి మద్దతునిస్తుందా?
రజాకార్ సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు ఇస్తుందని ఊహించలేదు. ఆ సినిమా తెలంగాణ చరిత్రను వక్రీకరించడమే కాదు, అది విషపూరితమైన విద్వేషాన్ని ప్రచారం చేసింది. ముస్లిం సమాజాన్నిఅనుమానించేలా, అవమానించేలా ఆ సినిమా వుందని విమర్శకులు తీవ్రమైన అభ్యంతరాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మత సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతున్నది. బిజెపి ప్రభుత్వం ఉన్నచోట ఇలాంటి అవార్డు ఇస్తే ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నచోట కూడా ఇలా అవార్డు ప్రకటించారంటే ఏమనుకోవాలి? కాంగగ్రెస్లో ఉన్నటువంటి సెక్యులర్వాదులనను చీట్ చేసినట్లే కదా! రేవంత్రెడ్డి చేశాడా? కాంగ్రెస్ చీట్ చేసిందా? లేదా అవార్డు కమిటీ చేసిందా? బిజెపీకి పనిచేసి పెట్టే కమిటీనా? అసలు ఆ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? ఆ కమిటీలో ఉన్న వ్యక్తులకు తెలంగాణ చరిత్ర, రాజకీయాల పట్ల కనీస అవగాహన లేదని అర్థమవుతుంది. బిజెపి భావజాలాన్ని ప్రోత్సహించేట్టయితే కాంగ్రెస్ను ఎందుకు గెలిపించుకున్నారు ఇక్కడి ప్రజలు? బిజెపినే గెలిపించుకోవచ్చు కదా!
ప్రజలు స్పష్టంగా బిఆర్ఎస్ని, బిజెపిని కాదని కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. కెసిఆర్ బిజెపికి అనుకూలంగా పనిచేస్తున్నాడనే ఫీలింగ్ ప్రజలకు కలిగింది. అందుకే సెక్యులర్ భావాలున్న పార్టీని గెలిపించుకోవాలనుకున్నారు. మరి గెలిచాక రేవంత్రెడ్డి చేస్తున్న పనేమిటి? ఎవరికి మద్దతు ఇస్తున్నాడు? చిన్నప్పుడు ఆరెస్సెస్లో పనిచేశానని రేవంత్రెడ్డి చెప్పుకున్నాడు. అదే భావజాలంతోనే ఉన్నాడనుకోవాలా?
దొంగగా, స్మగ్లర్గా, పోలీసులను అవమానించే హీరోగా నటించిన అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా అపహాస్యం చేస్తున్నారు నెటిజన్లు. గంధపు చెక్కల దొంగకు గద్దర్ అవార్డు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
సెలక్షన్ కమిటీలో పోటీకి వచ్చే సినిమాలకు పనిచేసిన వారు ఉండకూడదనే కనీస నియమాన్ని పాటించకుండా అవార్డులు ఇచ్చిన ‘రజాకార్’లో పాటలు రాసిన వ్యక్తిని కమిటీకి ఎంపిక చేయడం కూడా విమర్శలకు గురవుతోంది. దాంతో ఆ సినిమాకు మూడు అవార్డులు వచ్చాయని అంటున్నారు.
మొత్తంగా చూసినప్పుడు ఈ అవార్డుల వ్యవహారం అనేక విమర్శలకు గురవుతూ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్రెడ్డికి తలవంపులు తెస్తున్నది. కాంగ్రెసుకు ఇలా చెడ్డపేరు రావాలనే ఈ వ్యవహారం వెనుక ఏమైనా కుట్ర కోణం ఉన్నదా అని కూడా అనుమానిస్తున్నారు కొందరు. బిజెపి, బిఆర్ఎస్ సలహాదారుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాడని కూడా రేవంత్రెడ్డి మీద విమర్శలు వినిపిస్తున్నాయి. అవే నిజమైతే గనక, రేవంత్ రెడ్డి రానున్న స్థానిక ఎన్నికలలో ప్రతికూల ఫలితాలను చవిచూడక తప్పదు. ఈ నేపథ్యంలో గద్దర్ ఫిలిం అవార్డులను రద్దు చేసి, మహావాగ్గేయకారుడైన గద్దర్ గౌరవాన్ని కాపాడుకోవాలి. నిజానికి తెలంగాణ సినిమా కళాకారులు, దర్శకులు, ఉద్యమకారులు కోరుకుంటున్నది అదే.
డా. జిలుకర శ్రీనివాస్
VCK నాయకుడు, సామాజిక విశ్లేషకుడు
