Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Quality education: చదువుల్లో నాణ్యత- ప్రభుత్వాల బాధ్యత

Quality education: చదువుల్లో నాణ్యత- ప్రభుత్వాల బాధ్యత

జ్ఞానానికి జన్మనిస్తుంది, జాతి భవితను నిర్మిస్తుంది. సరైన నిర్ణయాలకు, సామాజిక విలువలకు ప్రాణం పోస్తుంది

ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఆయుధాలు, బయో వెపన్లు ప్రయోగించనవసరం లేదు. ప్రజలకు నాణ్యమైన విద్యను దూరం చేసి, వారిచే అసమర్ధ నాయకులను అధికార పీఠంపై కూర్చోబెట్టేలా చేస్తే చాలు దానికదే సర్వనాశమై పోతుంది అంటున్నారు నిపుణులు. దీన్ని బట్టి విద్యా వ్యవస్థ(బడి) ప్రాధాన్యత ఎంతో ఉందని తెలుస్తోంది. జ్ఞానానికి జన్మనిస్తుంది, జాతి భవితను నిర్మిస్తుంది. సరైన నిర్ణయాలకు, సామాజిక విలువలకు ప్రాణం పోస్తుంది. అజ్ఞానాన్ని నిర్మూలించే అత్యంత ప్రాముఖ్యత గల బడులు అనతి కాలంలోనే పునః ప్రారంభం కాబోతున్న వేళ.. బడులు సర్వహంగులతో సిద్ధంగా ఉన్నాయా! సకల సమస్యలతో కూనరిల్లుతున్నాయా.. ఉచిత, న్యాణమైన చదువులు అందుకోబోతున్న తరుణంలో ప్రభుత్వ విధానాలు, బాధ్యతలను పరిశీలిద్దాం.. ఉపాధ్యా యులు చదువులు చెప్పగలరు కానీ పాలకుల స్వభావాన్ని, విధానాలను మార్చలేరు. ప్రపంచంలోనే అతి పెద్ద పాఠ శాల విద్యా వ్యవస్థ మన దేశంలోనే ఉంది. దేశవ్యాప్తంగా సుమారు15 లక్షల పాఠశాలలున్నాయి. వీటిలో 25 కోట్ల మందికి పైగా విద్యార్థులకు 85 లక్షల మంది ఉపాధ్యా యులు బోధిస్తున్నారు. మైనం ముద్ద లాంటి చిన్నారులను భావి భారత నిర్మాతలుగా మలచడంలో సర్వహంగులున్న పాఠశాలలు, గురువుల పాత్ర కీలకం. ఆహ్లాదకరమైన
తరగతి గదిలో వృత్తి నిబద్ధత గల ఉపాధ్యాయుల బోధనలను అందిపుచ్చుకున్న జ్ఞానమే విద్యార్థుల భవిష్య త్తుకు చుక్కానిగా నిలుస్తుంది. వీరి ప్రతిభా పాటవాలే రేపటి దేశ అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ పాలకులకు విద్యా వ్యవస్థ మీద ఉన్న ఉదాసీన విధానాలకు తోడుగా, (2020-21/21-22) కోవిడ్‌ మహమ్మారి మరణ విజృంభనతో పాఠశాలలు దీర్ఘకాలం (రెండు విద్యా సంవత్సరాలు) మూతబడినాయి. ఆ తర్వాత ఆన్లైన్‌ చదు వుల పుణ్యాన చదువుల్లో అభ్యసన సామర్ధ్యాలు, విద్యా ప్రమాణాలు పాతాళానికి దిగజారిపోతున్నాయి.. బడి గడప తొక్కకుండానే నేరుగా ఆ కాలంలోని విద్యార్థులు వారి వయసు ఆధారం చేసుకుని మూడో తరగతిలోకి చేర్చుకో (కూర్చో)వలసి వచ్చింది. అలా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో భాష, గణిత తదితర విషయాల్లో విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయిలైన పఠనం, లేఖనం నైపుణ్యాలు ఘోరంగా తెగ్గోసుకుపోయిన చేదు వాస్తవాలను అనేక నివే దికలు, అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సంక్షోభం ప్రైవే ట్‌, ప్రభుత్వం అనే తేడా లేకుండా అందరిని కుదిపేసి దెబ్బ తీసినది. ఆ తర్వాత ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ట్యూషన్లు పెట్టించడం వల్ల అభ్యసన మెరుగైనట్లు తెలుస్తుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల్లో అత్యధికులు రెక్కాడితే గానీ డొక్కాడని పేద, బడుగు, మధ్య తరగతికి చెందిన పిల్లలు చదువుచున్నారు. వారి తల్లి దండ్రులు వారి బతుకు దెరువు, జీవనోపాధిపై పెట్టినంత శ్రద్ధ వారి పిల్లల చదువులపై పెట్టలేరు. ట్యూషన్లు లాంటివి సమకూర్చలేకపోయారు, వారి ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక విద్యలో నాణ్యత లేమి వీరికి శాపంగా మారింది. వీరు విజ్ఞాన పోటీ ప్రపంచంలో తట్టుకోలేక పోతున్నారు. దీని మూలంగా వీరి తల్లిదండ్రులతో పాటు ఈ తరం పిల్లలను కూడా విజ్ఞాన, ఆర్థిక, సామాజిక అసమానతలు వెంటాడబోతున్నాయి. ఇది ముమ్మాటికి దేశాభివృద్ధికి రేపటి తరానికి గొడ్డలి పెట్టుగా మారనుంది. ఈ ఉపద్రవాన్ని గుర్తించిన పాల కులు పలు నివేదికల, సూచనల మేరకు విద్యార్థుల సర్వతో ముఖ అభివృద్ధికి మూలమైన ప్రాథమిక తరగతుల్లో అభ్య సన సామర్ధ్యాలను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుండి ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసీ (ఎఫ్‌ ఎల్‌ ఎన్‌) పేరిట అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. తెలంగాణలో తొలిమెట్టు పేరుతో 2022 ఆగస్టు 15న దీనికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందే అభ్యసన సామర్ధ్యాలు ఎలా ఉన్నాయో? దేశవ్యాప్తంగా మౌఖిక, రాత పూర్వకంగా మొత్తం 20 మాతృభాషలు, గణితంలో మూడో తరగతి విద్యార్థుల ప్రగతిని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పరిశీలించారు. దేశంలోని 10వేల ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 3వ తరగతి చదువుతున్న 86వేల విద్యార్థుల అధ్యయన పరిశీలన నివేదిక ఇది. ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం.. నిమిషంలో 8 పదాలలోపు మాత్రమే చదవగలిగిన వారిలో కనీస ప్రాథమిక పరిజ్ఞానం లేదని అర్థం. 9-26 మధ్య పదాలను తప్పుల్లేకుండా చదివితే, ప్రపంచ కనీస ప్రమా ణాలను పాక్షికంగా అందుకున్నట్లు. 27-50 పదాలు చదవ గలిగితే ప్రపంచ కనీస సామర్థ్యాలు కలిగి ఉన్నారని లెక్క. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులపై ఎన్సీఈఆర్టీ పరిశీలనా నివేదికల మేరకు సగటున 52 శాతం మంది విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలు లేవని స్పష్టమైనది. అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా వరకు మెరుగ్గా ఉన్నారు. మూడో తరగతిలో మాతృ భాషను చదవలేక పోవుచున్నారు.19 శాతం మంది ఒక్క తెలుగు పదం కూడా చదవలేక పోవడం ఆందోళన కలిగి స్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో ఒక్కొక్క విద్యార్థిపై చేసే సగటు ఖర్చు అరవై వేలు దాటుతుంది అని చెప్తుంది. విద్యా ప్రమాణాలు మాత్రం వెనుకబాటులో నాసి రకంగా ఉంటుందనే ప్రభుత్వాల వాదనలు ఇలా ఉంటే?. వాస్తవ పరిస్థితులను పరిశీలిద్దాం.. పాఠశాల విద్యా బడ్జెట్‌ పెరుగుతున్నా అందులో సుమారు 90 శాతం నిధులు జీత భత్యాలకు పోను, మిగిలిన 10శాతం ఇతర సదుపాయా లకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఉద్దేశించిన ‘మన ఊరు- మనబడి/ మనబస్తీ- మన బడి‘ పనుల్లో కూడా వేగం పుంజుకోవడం లేదు. ఇప్పటికీ 85 శాతం బడుల్లో కంప్యూటర్లు లేవు. ఉపాధ్యాయుల కొరత ఉన్నా నియామకాలు చేపట్టడం లేదు. 6 వేలకు పైగా బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడే 5 తరగ తులు బోధించాల్సి వస్తుంది. బడి పారిశుద్ధ్య నిర్వహణ కోసం స్కావెంజర్లు లేరు, వాచ్మన్లు లేరు. పాఠ్యపుస్తకాలు, దుస్తులు సకాలంలో అందడం లేదు. గత అనుభవాలు.. వివిధ రకాల ఖాళీలతో పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది. 602 మండలాల్లో కేవలం 17 చోట్ల మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓ లు ఉన్నారు. పీజీ హెచ్‌ ఎమ్‌ లకు ఒక్కొక్కరికి నాలుగు ఐదు మండలాల చొప్పున అదనపు బాధ్యతలు ఇవ్వడంతో అటు ఉన్నత పాఠశాల, ఇటు ప్రాథమిక పాఠశాలలలో పర్యవేక్షణ కుంటుపడుతుంది. ప్రాంతీయ విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, జిల్లా ఉప విద్యా ధికారుల పోస్టులు ఇలా విద్యా వ్యవస్థ మొత్తం ఖాళీలతో కూనరిల్లుతూ, పర్యవేక్షణ లోపాలతో ప్రమాణాలు పడి పోతున్నట్లు అసర్‌ సర్వే 2022 చెప్తుంది. అంతేకాదు గతం కంటే గణనీయంగా పడిపోయినట్లు తెలిపింది. ఇలా ప్రభు త్వం లోపాలను కప్పి పుచ్చుకుంటూ సమస్యల పరిష్కారం చేయకుండా ఉపాధ్యాయులను సమాజంలో తక్కువ చేయ డం భావ్యమా! ప్రభుత్వ బడిని ప్రయోగశాలగా మార్చి నారు. ఇవి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు పిల్లలు వెళ్లడానికి తోడ్పాటు కావా! అది మీకు తెలియదా!. కరోనా మహమ్మారి మరణ మృదంగం వెరిసి విద్యార్థుల్లో మాతృ భాష, గణితం మిగతా విషయాలలో కనీస సామర్థ్యాల వెనుకబాటు తనంతో విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు భాషా పరిజ్ఞానంలో బలమైన పునాదుల కోసం ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక గ్రంథాలయాల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన జాన్‌ ఉడ్‌ (గీతా మురళి) సంస్థ మనదేశంలో 17 రాష్ట్రాల్లో పనిచేస్తుండగా వాటిలో తెలం గాణ ఉంది. ఇక్కడ 8 వందల పాఠశాలలలో ఈ తరహా గ్రంథాలయాలు ఇప్పటికే ఉండగా, ప్రభుత్వంతో కలిసి మరో 2,400 పాఠశాలలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయబోతుంది. వీటి ద్వారా సుమారు 1.8 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషల్లో చదవడం, రాయడం భాషా ప్రయోజనాలు చేకూర్చడం, జ్ఞాపక శక్తిని పెంచడం వంటి అంశాలపై ‘రీడ్‌ టు రూమ్‌’ దృష్టి పెడుతుంది. ఆకర్షణీయ పుస్తకాలు, అకట్టుకునే కథలు ఉండేలా చూస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఈ ప్రత్యేక గ్రంథాలయాల ద్వారా 2025 నాటికి 5వ తరగతి లోపు విద్యార్థులందరిలో భాషా నైపుణ్యాలు నేర్పడం లక్ష్యంగా ‘రీడ్‌ టు రూమ్‌’ గ్రంధా లయాలు పనిచేయబోతున్నాయని తెలియజేస్తున్నారు. ఏ విషయాన్ని అవగాహన చేసుకోవాలన్నా.. భాషపై పట్టు రావాలి. భాషాపరమైన వెనుకబాటు ఉంటే ఇతర సబ్జెక్టు (విషయా)ల్లో రాణించలేరు. ఈ సమస్య పరిష్కరించబడా లన్నా.. పాఠశాల విద్య బాగుపడాలన్నా.. క్షేత్రస్థాయిలో ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి ప్రభుత్వాలు టైం బాండ్‌ ప్రోగ్రాం తో బడులను సకల సౌకర్యాలతో ఎలాంటి ఖాళీలు, సమస్యలు లేని విధంగా సర్వహంగులతో తయారు చేయా ల్సి ఉంది. ప్రభుత్వ బడంటే? సమాజ ఆస్తి. అది విలువలు, సమానత్వం, నైతికత పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల పౌరులను తయారు చేసే కేంద్ర బిందువు. జీవితాన్ని నిల బెట్టే నాణ్యమైన విద్య పొందడం బాలబాలికల ప్రాథమిక హక్కు. విద్యా వ్యాపారాన్ని ఆపి ‘కామన్‌ స్కూలు’ విధా నంలో అందరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందించాలి..
మేకిరి దామోదర్‌
సామాజిక విశ్లేషకులు

  • 9573666650
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News