Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Telangana Universities: తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు!

Telangana Universities: తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు!

తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి, నిధుల లేమితో కొట్టుమిట్టాడిన విశ్వవిద్యాలయాలు నేడు పూర్వ వైభవ దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యావ్యవస్థను పూర్తిగా పక్షాలన చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి.2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాలు బోధన బోధనేతర విద్యార్థి చేపట్టిన సాహసోపేతమైన ఉద్యమం నేడు తెలంగాణ రాష్ట్ర సాధనకు దోద పడిందనే చెప్పాలి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు 2014 బోధన పరిశోధన అభివృద్ధి అన్ని రంగాలలో ముందు వరుసలో ఉన్న విశ్వవిద్యాలయాలు నేడు దీనస్థితిలో కొట్టు మిటాడుతున్నాయి, ఉద్యోగపర్తి లేక విశ్వవిద్యాలయాల బోధన , పరిశోధన పూర్తిగా అడుగంటి పోయింది గత పది సంవత్సరాలుగా యూనివర్సిటీలను పట్టించుకోనులేని ప్రభుత్వం ఉండడంవల్ల యూనివర్సిటీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలోనే పెద్ద విశ్వవిద్యాలయాలుగా పేర్కొనబడతాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించిన విశ్వవిద్యాలయంగా, ఇందులో చదువుకున్న ఎంతోమంది మేధావులు ఉన్నతమైన స్థానాలలో ముఖ్యంగా రాజకీయ ఆర్థిక సామాజిక శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నారని చెప్పాలి ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన యూనివర్సిటీలను గత టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపను పోలేదు. విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికలుగా చేసుకొని గత ప్రభుత్వం యూనివర్సిటీలలో పోలీసుల మోహరంపు విద్యార్థుల సామాజిక హక్కులను కూడా కాలరాసే విధంగా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు అనుసరించిన విధానం వర్ణాతీతం. గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో పోలీసుల క్యాంపులు ప్రతి విషయానికి కూడా విశ్వవిద్యాలయంలో అధికారులు పోలీసులను పిలిపించి విద్యార్థులు ఎలాంటి హక్కుల కోసం ఉద్యమించకుండా కట్టడి చేసినారు. కనీసం విద్యార్థుల సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడం ప్రతి చిన్న విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోయే విధంగా పోలీసులు వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు దారి తీసింది. ఇప్పటికీ నిత్యం క్యాంపస్లలో పోలీసుల పహారా కొనసాగుతుంది. విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని విద్యార్థులు ఉద్యోగస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన నిరంకుశ పరిపాలన వ్యవస్థను విడనాడి మానవ హక్కులను గౌరవించే విధంగా విశ్వవిద్యాలయాలలో పోలీసుల జోక్యం లేకుండా తగు చర్యలు చేపట్టాలని సవిద్యాలయంలో మేధావులు విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు చర్చించకుండా కేవలం పోలీసులచే నోరు మూయిస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితులను పరిశీలించి ఎందుకు చేపట్టాల్సిన కార్యచరణ ప్రణాళికను రూపొందించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని విశ్వవిద్యాల అధికారులను కోరిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితులను చెల్లించి చర్యలు చేపట్టాలని అంటున్నారు బోధన పరిశోధన రంగాలను బలోపేతం చేసే దిశగా నిధుల లేమి తో విశ్వవిద్యాలయాలకు 2014 పూర్వం ఉన్న స్థితిలను నెలకొల్పే దిశగా అడుగులు వేస్తుంది. దాదాపుగా విశ్వవిద్యాలయాలు అధ్యాపకుల కొరత ఎదుర్కొంటుంది. వీటి భర్తీ విషయంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా, మీది మాటలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రిక్రూట్మెంట్ చేస్తామని అనేకసార్లు ప్రకటనలు కుమ్మరించిన ఆచరణలో మాత్రం శూన్యం. గత 20, 25 సంవత్సరాలుగా ఒప్పంద అధ్యాపకులు, రోజువారి అధ్యాపకులు బోధన కొనసాగిస్తున్నారు, గడిచిన ఈ పది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం విద్యను బలోపేతం చేసే దిశగా అడుగులు వెయ్యలేదు.
2).సమస్యల వలయంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు:
తెలంగాణ రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి ఇందులో పనిచేస్తున్న 1300మంది గత 25 సంవత్సరాలుగా ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరిని శాశ్వత ప్రతిపాదిక గా తీసుకోవాలని గతంలో అనేకసార్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి ఇందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం సాధన సమయంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగస్తులు అందరిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని నాటి ఉద్యమ నేత నేటి తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. కానీ రాష్ట్రం సాధించి తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను పర్మినెంట్ చేయకపోవడం సూచనియమని పలువురు మేధావులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుటకు ఏప్రిల్ 30వ తేదీ సచివాలయం ప్రారంభ సమావేశంలో మొదటి ఫైల్ పై సంతకం చేసిన ముఖ్యమంత్రి విశ్వవిద్యాలయాల పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల విషయం అందులో లేకపోవడం చాలా వరకు బాధ కలిగిన విషయం చెప్పకనే చెబుతున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్ర పోరాటం చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉద్యోగస్తులు ముఖ్యంగా ఒప్పంద ఉద్యోగస్తులు ఎంతగానో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనకు అహోరాత్రులు కృషి చేసి పోలీసు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ గాని ఒప్పంద అధ్యాపకులను ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి శాశ్వత ప్రాతిపదికన చేస్తే విద్యాలయాల మనగడ కొనసాగుతుంది.భారత దేశవ్యాప్తంగా 1,057 విశ్వవిద్యాలయాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో 54 సెంట్రల్‌ యూనివర్సిటీలు, 453 స్టేట్‌ యూనివర్సిటీలు, 126 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 410 ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన తొలి 500 విశ్వవిద్యాలయాల్లో భారతదేశానికి చెందిన 8 యూనివర్సిటీలు, తొలి 1,000 విశ్వవిద్యాలయాల్లో 35 మాత్రమే ఉండడం మన ఉన్నత విద్యాసంస్థల విద్యా ప్రమాణాలను ఎక్కిరిస్తున్నాయి. వైభవంగా విశ్వ విజ్ఞానాన్ని పంచిన గత సరస్వతి విశ్వవిద్యాలయాలు నేడు పలు సవాళ్ళ నడుమ దేవుడు లేని ఆలయాలుగా కృంగి కృశించిపోయే దుస్థితికి చేరడం యువభారతానికి శాపంగా మారతున్నది. ఉన్నత విద్యపై ప్రభుత్వ నిధుల కేటాయింపులు గత దశాబ్దకాలంగా బడ్జెట్‌లో 1.5 శాతం కన్న పెరగడం లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,482 కోట్లు ఉండగా, 2022-23లో 2,078 కోట్ల మాత్రమే కేంద్ర విద్యాశాఖ కేటాయించడం విచారకరమే కాదు ప్రమాదకరం కూడా. కేటాయింపులు తగ్గడంతో పాటు 25 శాతం విద్యార్థుల ప్రవేశాలను పెంచడం, అధ్యాపకుల సంఖ్యను మాత్రం పెంచకపోవడం విచారకరం.
సౌకర్యాల లేమితో భారతీయ విశ్వవిద్యాలయాలు:
దీనికి తోడుగా యూనివర్సిటీల్లో పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు 8 శాతం నిధుల కోతను విధించడంతో గోరుచుట్టుపై రోకలి పోటులా యూనివర్సిటీ విద్య, పరిశోధనలు, మౌళిక వసతులు కొరవడి వెలవెలబోతూ, యువతను ఉన్నత విద్యతో ప్రయోజకులను చేసే యజ్ఞంలో విఫలం అవుతున్నాయి. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అర్హతగల అధ్యాపకుల కొరత, లైబ్రరీ నిధుల కోతలతో జర్నల్స్‌/పుస్తకాల కొరత, జీతభత్యాల చెల్లింపులో జాప్యం, సౌకర్యాల కొరత, తరగతి గదుల్లో అతిగా విద్యార్థుల సంఖ్య, వసతులులేని హాస్టల్స్‌, పారిశుధ్యలేమి లాంటి అనేక సమస్యలు చుట్టు ముట్టి విద్యాబోధన, పరిశోధనలు అంతరించే స్థాయికి చేరడం దేశ ప్రగతికే గొడ్డలి పెట్టు కానున్నాయి. విశ్వవిద్యాలయాలు రోజువారి ఖర్చుల నిమిత్తం 2022-23లో రూ: 4,900 కోట్లు ఉండగా, 2021-22లో రూ: 4,693 కోట్ల నిధులు విడుదల చేశారు. ప్రతి పైసాకు రాష్ట్ర/కేంద్ర/డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు శ్రమపడాల్సి వస్తున్నది. దేశ రాజధానిలోని పలు యూనివర్సిటీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. యూజీసీ నుంచి మేజర్‌, మైనర్‌ పరిశోధనల ప్రాజెక్టులకు కేటాయింపులు 2016-17లో 42.7 కోట్లు ఉండగా, 2020-21లో 38 కోట్లకు కుదించడం జరిగింది. దేశవ్యాప్త విశ్వవిద్యాలయాల్లో 2.7 శాతం మాత్రమే పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. బలహీన పాలనా వ్యవస్థల నిర్మాణాలు, రాజకీయ ఒత్తిడిలు, పారదర్శకత/జవాబుదారీతనం లోపించడం, మౌళిక వనరుల అగాధాలు, అధ్యాపకుల ప్రమాణాల్లో కొరతలు, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిలో వ్యత్యాసాలు, పరిశోధనా నిధుల కోతలు, పీహెచ్‌డి ప్రోగ్రామ్స్‌ లేకపోవడం, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు తరగడం, కనీస అవసరాలకు నిధులు కాకపోవడం లాంటి అనేక తీవ్ర సమస్యల వలయంలో చిక్కుకున్న విశ్వవిద్యాలయాలు యువభారతానికి ఆశించిన స్థాయిలో ఉన్నత విద్యను అందించడంలో విఫలం అవుతున్నాయి.
అవినీతి నీడలో రాష్ట్ర యూనివర్సిటీలు:
విశ్వవిద్యాలయాల్లో తగ్గిన విద్యా ప్రమాణాలు, ప్రయోగశాల సౌకర్యాల లేమి, అధ్యాపకుల కొరత లాంటి పలు సమస్యలకు సమీప భవిష్యత్తులో సమాధానం దొరికే దారులు కనిపించడం లేదు. దీనికి తోడు నకిలీ డిగ్రీలు, పేపర్‌ లీకేజీలు, కలుషిత మూల్యాంకన కథనాలు, అవినీతి రాజ్యమేలడం, క్యాపస్‌లో పోలీసు స్టేషన్లు వెలువడం, భావప్రకటనా స్వేచ్చను హరించడం, యువత చుట్టు కంచె కట్టి మేధో విస్తృతిని కుదించడం, ప్రజాస్వామ్య హక్కులకు కత్తెర వేయడం, విశ్వవిద్యాలయాలు అధికార పార్టీల స్థావరాలు కావడం, విసీలు అధికార యంత్రాంగానికి లొంగిపోవడం లాంటి పలు తీవ్ర సమస్యలు నేటి యువ విద్యార్థుల ఎదుగుదలకు విఘాతాలను కలిగిస్తున్నాయి. నేడు పలు విశ్వవిద్యాలయాలలో ఉపకులపతికి ఇతర పాలకవర్గానికి మధ్య రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం, విసీ చేసిన నియామకాలు విమర్శల పాలు కావడం విశ్వవిద్యాలయ పరువును దిగజార్చడం చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డి ఫీజును 2,500/-ల నుంచి ఏకంగా రూ:25,000/-లుకు పెంచడం, యూనివర్సిటీ ప్రాంగణంలో రాహుల్‌ గాంధీ సమావేశానికి అనుమతిని నిరాకరించడా లాంటి విసీ నిర్ణయం పలు విమర్శలకు దారి తీశాయి. జెయన్‌టియు విసీ నియామకంతో పాటు అతను తీసుకున్న పొరుగు సేవల సిబ్బంది నియామకాల విషయంలో పలు ఆరోపణలు చుట్టుముట్టాయి. బాసర ఆర్‌జియూకెటిలోని ఐఐఐటీ విద్యార్థులు హాస్టల్‌ వసతులు, ఆహార నాణ్యత, ప్రయోగశాల సౌకర్యాల విషయాల్లో రోడ్డుకెక్కడం చూసాం. విశ్వవిద్యాలయ ఉమ్మడి నియామకాలకు సంబంధించిన ఫైలు గవర్నర్‌ టేబుల్‌ మీద కొద్ది మాసాలుగా మూలుగుతున్నది.
అంతర్జాతీయ స్థాయి బోధనలు:

- Advertisement -

నేషనల్‌ రీసెర్చ్ ‌ఫౌండేషన్‌ ద్వారా రాబోయే ఐదు ఏళ్ళలో రూ: 600 కోట్లు వెచ్చించనున్నారు. నూతన విద్యావిధానం-2020 అమలు ద్వారా యువభారత మెదడులో క్రిటికల్‌ థింకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సామాజిక-మానవీయ-భావోద్వేగ విలువల విత్తులు నాటడం జరగాలని కోరుకుందాం. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడడం, అవసర నిధులను కేటాయించడం, విద్యను పరిశోధనలకు ముడిపెట్టడం, విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిని కాపాడటం, పాలనా సంస్కరణలు తేవడం, క్యాంపస్‌లో విద్య వాతావరణాన్ని నెలకొల్పడం, అధ్యాపకుల నియమకాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించడం, ఆధునిక డిజిటల్‌ యుగ మేధో వికాసం ఫలించడం, నైపుణ్య యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, విసీలను రాజకీయాలకు అతీతంగా నియమించడం లాంటి పలు పరిష్కార చర్యలతో భారతీయ యువత ప్రపంచానికి జ్ఞాన వెలుగులు పంచడం జరగాలి. ఇదే విధంగా ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడం, అశాంతితో ఎదురు తిరగడం, నిరుద్యోగం పేట్రేగి పోవడం జరిగే ప్రమాదం నుంచి పాలకులు సరైన సత్వర పరిష్కారాలు చూపాలి.

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News