Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్గిరిజనుల అభివృద్ధి ప్రభుత్వాల బాధ్యతే!

గిరిజనుల అభివృద్ధి ప్రభుత్వాల బాధ్యతే!

భార­త­దే­శా­నికి స్వతంత్రం వచ్చి అనేక సంవ­త్స­రాలు గడి­చినా పాల­కులు, అధి­కార యంత్రాంగం మారినా గిరి­జ­నుల తలరాతలు మారడం లేదు. భారత రాజ్యాం­గంలో గిరి­జన జీవన స్థితి­గ­తులు మెరు­గు­ప­ర­చ­డా­నికి ప్రత్యే­క­మైన చట్టాలు, హక్కులు కల్పిం­చడం జరి­గింది. గిరి­జ­నుల సంక్షేమం, అభి­వృద్ధి కోసం ఉన్న ఆ చట్టాలు కొంద­రికి చుట్టా­లుగా మారి­నాయి తప్ప గిరి­జ­ను­లకు దోహ­ద­ప­డటం  లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా గిరి­జన బతు­కులు మారడం లేదు. ప్రజా­స్వామ్య భార­త­దే­శంలో అన్ని పార్టీలు గిరి­జ­ను­లకు తమ జెండాలు మోయ­డా­నికి ముడి సరుకుగా ఉప­యో­గిం­చు­కొని ఒక ఓటు బ్యాంకు­గానే చూస్తు­న్నారు. రాజ్యాం­గంలో ఐదో షెడ్యూల్లో గిరి­జ­ను­లకు ప్రత్యే­క­మైన హక్కులు చట్టాలు కల్పిం­చిన వాటిని అమలు పర­చ­డంలో ప్రభు­త్వాలు విఫ­ల­మ­య్యా­యని అన­డంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

తెలం­గాణ  రాష్ట్రంలో గిరి­జ­నులు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్‍, పిసా చట్టం, రూల్‌ ఆఫ్‌ రిజ­ర్వే­షన్‌ అమలు చేయడం లేదు. గిరి­జ­నుల సంక్షేమ అభి­వృద్ధి కోసం కేటా­యిం­చిన నిధులు ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్క­దారి మళ్లించి గిరి­జ­నుల అభి­వృ­ద్ధికి ఆటంకం కలి­గి­స్తు­న్నారు. పాల­కులు అధి­కా­రులు గిరి­జ­నుల సంక్షేమం అభి­వృద్ధి కోసం అనేక కార్య­క్ర­మాలు చేప­డు­తు­న్నా­మని హంగు ఆర్భా­టాలతో ప్రచారం చేస్తాయి. కానీ జీవోలు కాగి­తా­లకే పరి­మితం అవు­తాయి తప్ప వాటిని అమలు చేయ­డంలో నత్త­న­డ­కగా జాప్యం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తా వస్తు­న్నారు. దానికి ఉదా­హ­ర­ణలు కోకొ­ల్ల­లుగా ఉన్నాయి. నేటికీ గిరి­జన గూడా­లకు తండా­లకు మౌలిక సదు­పా­యాలు రోడ్డు రవాణా వీధి దీపాలు నీళ్లు విద్య వైద్యం అందని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రభు­త్వాలు వీరికి సంక్షేమ ఫలాలు అందిం­చడం కోసం వేల కోట్ల రూపా­యలు బడ్జెట్లో కేటా­యించామని గొప్పలు చెప్పు­కుం­టాయి. కానీ ఎక్కడా అవి ఖర్చు చేసినట్లు కని­పిం­చదు. దక్షిణ భార­త­దే­శంలో అత్య­ధి­కంగా గిరి­జన జనాభా ఉన్న రాష్ట్రం తెలం­గాణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో నేటికీ  గిరి­జ­నుల అమా­య­క­త్వాన్ని ఆసరా  చేసు­కొని వారిని అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంచుతున్నారు. నేటికీ అనేక గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా తెలం­గాణలోని ప్రాంతాలలో పాల­కులు అధి­కా­రులు గిరి­జ­నుల చట్టాలను అమలు చేయ­డంలో వివ­క్షత చూపి­స్తున్నారు.

ప్రకృతి తల్లి ఒడిలో పుట్టిన గిరి­జ­నులు
భూమి.. ఆకాశం.. నీరు.. నిప్పు.. చెట్టు ఇవే వారి ఆరాధ్య దైవాలు. అడవి, సెల­యేర్ల పరి­వా­హ­కాలే వారి నివా­స­యో­గ్యాలు. చల్లంగా చూడమ్మా అంటూ ప్రకృతి తల్లిని నమ్ము­కుని బతు­కు­తారు..  తమ ఆరాధ్య దైవా­లను కొల­వ­నిదే ఏ పనీ ముట్టరు. అనా­దిగా ప్రకృ­తినే నేస్తంగా చేసు­కుని స్వచ్ఛ­మైన జీవనం గడు­పు­తున్న గిరి­జనం వారి సమా­జం­లోని సంప్ర­దా­యా­లను కొన­సా­గిం­చ­లేని స్థితిలో ఇవాళ కొట్టు­మి­ట్టా­డు­తు­న్నారు. దారి లేని అడ­వుల్లో ఆనందం ఉంది. ఏకాంత తీరంలో నిశ్చ­ల­మైన వెలు­గుంది. ఎవరూ అడు­గు­పె­ట్టని ప్రాంతంలో సమాజం ఉంది… అని అన్నాడో కవి. కానీ దీనికి భిన్నంగా ఇప్పటి పరి­స్థి­తు­లు­న్నాయి. చొర­బా­టు­త­నంతో తమ ఆచారం, సంప్ర­దాయం, సంస్కృతి కను­మ­రు­గ­వు­తుం­దన్న ఆవే­దన వారిని పట్టి పీడి­స్తోంది. పాల­కుల విధా­నాలు తమని అడ­వికి దూరం చేస్తు­న్నా­యన్న భయాం­దో­ళ­నలో గిరి­జ­నులు బతు­కు­తు­న్నారు.

ఐక్య­రాజ్య సమితి నేతృ­త్వంలో 1982, ఆగస్టు తొమ్మి­దిన జెనీ­వాలో నిర్వ­హిం­చిన మానవ హక్కుల పరి­ర­క్షణ సమా­వే­శంలో అంత­రిం­చి­పోతు న్న ఆదిమ తెగ అంశం తెర­మీ­ద­కొ­చ్చింది. దీంతో వీరి జీవన విధా­నంపై అధ్య­యనం చేయా­ల్సిం­దిగా ఐక్య­రాజ్య సమితి సూచిస్తూ ఆరు వర్కింగు కమి­టీ­లను నియ­మిం­చగా వారి జనాభా, భాషలు, తెగలు, సంస్క­ృతు­లపై అధ్య­యనం చేసి ఓ నివే­ది­కను 1992లో సమ­ర్పిం­చాయి. తర్వాత 1994, డిసెం­బరు 23న ఐక్య­రాజ్య సమితి నిర్వ­హిం­చిన సర్వ­స­భ్య­స­మా­వే­శంలో ప్రతి­ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆది­వాసీ దినో­త్స­వాన్ని నిర్వ­హిం­చా­ల్సిం­దిగా రిజ­ల్యూ­షన్‌ పాస్ చేశారు. అప్ప­టి­నుంచి ప్రతి­ఏటా ఈ రో­జున ప్రపంచ ఆది­వాసీ దినో­త్స­వాన్ని జరు­పు­తు­న్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశం­లోని 15 శాతం ప్రాంతంలో 10.428 కోట్ల గిరి­జ­నులు (ఎస్.టి) ఉన్నా­రని, వారి జనాభా దేశం మొత్తం జనా­భాలో 8.61 శాతంగా ఉందని తేలింది. సామా­జి­కంగా, ఆర్ధి­కంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ కన­ప­ర్చ­వ­లసి వుందని గమ­నిం­చ­బ­డింది. విద్యుత్‌ శక్తి, త్రాగు నీరు, వ్యవ­సాయ భూము­లను స్వంతంగా కలి­గి­వుం­డుట, బాలిం­తల, శిశు­వుల మర­ణాలు మొద­లైన విష­యా­లకు వస్తే, వీరు సాధా­రణ ప్రజా­నీకం కంటే చాలా వెను­క­బడి వున్నారు. 2009-–10 లెక్కల ప్రకారం 47.4% గ్రామీణ, 30.4 పట్టణ ప్రాంతా­లలో గిరి­జన (ఎస్.టి) జనాభా దారి­ద్య్ర­రే­ఖకు దిగు­వన జీవనం సాగి­స్తు­న్నారు.
భారత రాజ్యాంగం గిరి­జ­ను­ల­లోని అన్ని తెగ­లను షెడ్యూల్డు తెగ­లుగా నిర్వ­చిం­చ­లేదు. భారత రాజ్యాం­గం­లోని అధి­క­రణ 342 ను, 366 (25)ను అను­స­రించి షెడ్యూల్డు తెగలు అనగా షెడ్యూ­లులో వివ­రిం­చిన తెగలు/ వర్గాలు మాత్రమే షెడ్యూల్డు తెగ­లుగా నిర్వ­చిం­చారు. భారత రాజ్యాంగం అధి­క­రణ 342 ప్రకారం షెడ్యూల్డు తెగలు లేదా గిరి­జ­నులు అనగా లేదా గిరి­జ­ను­ల­లోని కొన్ని తెగలు, కొన్ని వర్గాలు లేదా అన్ని వర్గాలు లేదా అన్ని తెగలు అని భారత రాష్ట్ర­పతి ద్వారా ప్రక­టిం­ప­బ­డిన ప్రక­ట­నలో పేర్కొ­న్నారు. 1991 జనాభా లెక్క­లను అను­స­రించి గిరి­జ­ను­లలో 6.776 కోట్ల మంది, దేశ జనా­భాలో 8.08 శాతం మాత్రమే పెడ్యూల్డు తెగ­లుగా ప్రాతి­నిధ్యం వహి­స్తు­న్నారు.
గిరిజన మహిళల్లో నలుగురిలో ముగ్గురు నిరక్షరాస్యులు. అసలే నియత విద్యలో పాఠ­శా­లకు వెళ్లడం మాను­కున్న వారి శాతంతో కలిపి ఎక్కువ మంది విద్యకు దూర­మ­వు­తుం­డగా, ఈ వ్యత్యా­సాలు ఇలా­వుం­డగా, వారిలో అతి తక్కువ శాతం మంది ఉన్నత విద్యా­ర్జ­నలో వున్నారు. ఆశ్చర్య పడ­కూ­డని విష­య­మే­మిటంటే, దేశం­లోని సగటు పేద­రి­కాన్ని అంచ­నా వేస్తే అందులో అతి ఎక్కువ శాతం మంది గిరి­జ­నులు సాధా­రణ పేద­వారి కంటే ఎంతో హెచ్చు స్థాయిలో దారిద్య్ర రేఖకు దిగు­వన జీవనం సాగి­స్తు­న్నారు. 1993–-94లో ప్రణా­ళికా సంఘం పేద­రి­కంపై చేసిన అధ్య­య­నంలో 51.92 శాతం మంది గ్రామీణ గిరి­జ­నులు, 41.4 శాతం మంది పట్టణ గిరి­జ­నులు (ఎస్.టి) ఇప్ప­టికీ దారిద్య్ర రేఖకు దిగు­వన జీవనం సాగి­స్తు­న్నా­రని తెలి­సింది.

భారత రాజ్యాం­గంలో ఈ గిరి­జ­నుల కోసం (ఎస్.టి)ల కొన్ని ప్రత్యేక ప్రయో­జన కార­క­మైన నిబం­ధ­న­లను పొందు­ప­ర్చారు. వారి విద్యా­భ్యు­న్న­తికి, ఆర్థిక ప్రగ­తికి, వారికి సామా­జిక న్యాయం జరి­గేలా, ఇంకా వారు ఏ విధ­మైన శ్రమ దోపి­డికి గుర­వ­కుండా రక్ష­ణను ఈ నిబం­ధ­న­లలో పేర్కొ­న­బ­డింది. పంచ వర్ష ప్రణా­ళికా విధానం ప్రారంభ సమ­యం­లోనే ఈ లక్ష్యాల సాధన కోసం గిరి­జన ఉప వ్యూహం ఒక­దా­నిని రూపొం­దిం­చారు. ఈ ఉప వ్యూహం, ఈ లక్ష్యా­లను సాధించే దిశలో రూపొం­దిం­ప­బడి, వాటిని అమలు చేస్తుంది. ఈ వ్యూహం లేదా ఉప ప్రణా­ళి­కను అమలు చేసి గిరి­జ­నుల అభి­వృద్ధి సాధిం­చేం­దుకు తగి­నంత నిధు­లను రాష్ట్ర ప్రణా­ళి­కల్లో కేటా­యించి, అలాగే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభా­గాల పథ­కాలు/ కార్య­క్ర­మా­లలో కేటా­యిం­పులు జరిపి, ఆర్ధిక, అభి­వృద్ధి సంస్థలు అందించే ధన సహా­యంతో నిర్వ­హి­స్తారు. ఈ ఉప ప్రణా­ళి­కలో భాగంగా అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతా­లలో వాటిలో వున్న గిరి­జ­నుల జనాభా  నిష్ప­త్తిని అను­స­రించి గిరి­జన ఉప ప్రణా­ళిక నిధు­లను కేటా­యి­స్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభు­త్వాలు, పరి­పా­లనా యంత్రాం­గాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభా­గాలు ఈ గిరి­జ­నుల ఉప ప్రణా­ళి­కను అమ­లు­చేసి వారిని సామా­జి­కంగా, ఆర్థి­కంగా అభి­వృ­ద్ధి­లోకి తేవ­డా­నికి కృషి చేస్తాయి. కాగా కేంద్ర గిరి­జన వ్యవ­హా­రాల మంత్రిత్వ శాఖ కూడా వారికి వివిధ రకాల పథ­కాలు, కార్య­క్ర­మాలు అమలు చేయడం ద్వారా వారికి ప్రయో­జనం కలి­గి­స్తాయి.

గిరి­జ­నులు ప్రభు­త్వా­ల నుంచి కోరు­తున్న అంశాలు:
1. గిరి­జన జనాభా లెక్కల ప్రకారం 10% విద్యా, ఉద్యోగ, రాజ­కీయ రంగా­లలో గిరి­జ­ను­లకు రిజ­ర్వే­షన్‌ సత్వ­రమే అమలు చేయాలి. తెలం­గాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వ­హిం­చిన కుల­గ­ణ­నలో ఎస్టీ లంబాడి జనా­భాను బహి­ర్గతం చెయ్యాలి.
2. తెలం­గాణ రాష్ట్రం­లోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టు­లను వెంటనే భర్తీ­చే­యాలి.
3. 500 జనా­భాలో గల తండా­లను, గూడా­లను గ్రామ పంచా­యితీ ఏర్పాటు చేశారు గాని, రెవెన్యూ గ్రామ­పం­చా­య­తీ­లుగా  సత్వ­రమే  చేయాలి.
4. కర్ణా­టక రాష్ట్రంలో తండాల అభి­వృద్ధి బోర్డు తరహా తెలం­గాణ రాష్ట్రంలో తండా­ల ­అ­భి­వృద్ధి కోసం బోర్డును ఏర్పాటు చేయాలి.
5. ఎస్సీ ఎస్టీ ప్రైడ్‌ ఇండ­స్ట్రి­యల్‌ అండ్‌ కామర్స్‍ అనే పథకం ద్వారా గిరి­జన సోద­రు­లకు వివిధ రకాల వాహ­నాలపై ఇస్తా­మని చెప్పిన సబ్సి­డీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడు­దల చెయ్యాలి.
6. బయ్యారం స్టీల్‌ ప్లాంటును కూడా ఖమ్మం, వరం­గల్‌ జిల్లాల సరి­హద్దు ప్రాంతం­లోనే ఏర్పాటు చేయాలి.
7. మైదాన ప్రాంతంలో ఉన్న గిరి­జ­నుల కోసం, వారి అభి­వృద్ధి సంస్కృతి, ఆచార సాంప్ర­దా­యాల పరి­ర­క్షణ కోసం ఐటీ­డీఎ లను ఏర్పాటు చేయాలి.
8. గిరి­జ­నులు సాగు చేసు­కుం­టున్న పోడు భూముల హక్కు పత్రాలు జారీ చేయాలి.
9. విద్యా­హక్కు చట్టం అమలు చేసి అన్ని కార్పొ­రేట్‌ విద్యా­సం­స్థ­ల్లోనే ఎస్టీ విద్యా­ర్థు­లకు 25% విద్యా­హక్కు చట్టం పొందేలా అమలు చేయాలి.
10. ఎస్టీ సబ్‌ ప్లాన్లో కేటా­యిం­చిన నిధులు నిర్దే­శిత సమ­యంలో ఖర్చు చేసే­టట్లు చర్యలు చేప­ట్టాలి.
11. గిరి­జన విద్యా­ర్థు­లకు అన్ని జిల్లాలో పోటీ పరీ­క్ష­ల­కోసం గ్రూప్‌1,2, గేట్‌ ఇతర అన్ని పోటీ పరీ­క్ష­లకు స్టడీ సర్కిల్స్‍ ఏర్పాటు చేయాలి.
12. ఎలాంటి షర­తులు లేకుండా బ్యాంకులు గిరి­జ­ను­లకు రుణాలు సత్వ­రమే మంజూరు చేయాలి.
13. నియో­జ­క­వర్గ స్థాయిలో, మండ­ల­స్థా­యిలో చదు­వు­తున్న విద్యా­ర్థు­లకు ఎస్టీ స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి.
14. గిరి­జన నిరు­పే­ద­లకు 3 ఎక­రాల భూమిని సత్వ­రమే కేటాయించాలి.
15. బంజా­రాల పవి­త్ర­మైన తీజ్‌ పండు­గను తెలం­గాణ ప్రభుత్వం 20 కోట్లు నిధులు మంజూరు చేసి అధి­కా­రి­కంగా నిర్వ­హిం­చాలి.
16. బంజారా భాష లిపి ఏర్పా­టుకై షెడ్యుల్‌ 8లో చేర్పిం­చుట గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసు­కో­వాలి.
17. ప్రతి జిల్లా, నియో­జ­క­వర్గం కేంద్రంలో బంజారా భవన్‌ ఏర్పా­టుకై తెలం­గాణ ప్రభుత్వం చర్యలు తీసు­కో­వాలి.
18. తెలం­గా­ణ­లోను జిల్లా యూని­ట్గాను చట్ట­సభ (అసెంబ్లీ / పార్ల­మెంటు)లయందు ప్రతి రాష్ట్రం­లోను ప్రస్తుతం ఎస్సీ­లకు సీట్ల రిజ­ర్వే­షన్లు చేసి­న­ట్లు­గాను ఎస్టీ­లకు కూడా ప్రతి జిల్లా యూనిట్గా తీసు­కొని చట్ట­స­భలో గిరి­జన జనాభా ప్రకారం రిజ­ర్వే­షన్‌ కల్పిం­చాలి.
19. ఎస్టీలు సాగు చేస్తున్న లావుణి, సీలింగ్‌, పోడు భూము­లకు శాశ్వ­తంగా పూర్తి హక్కు­లతో అసెంబ్లీలో చట్టం చేసి పట్టాలు ఇవ్వాలి.
20.రాజ్యాం­గం­లోని 5వ షెడ్యూల్‌ ద్వారా ఎజెన్సీ ప్రాంతంలో 100% శాతం రిజ­ర్వే­ష­న్లను  రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యాలి.
21. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీల స్థానాలు పెంచే పున­ర్వీ­భ­జనలో రాష్ట్ర జనాభా యూనిట్‌ కాకుండా, జిల్లా జనాభా యూనిట్‌ ఆధా­రంగా ఎస్టీలకు ఎమ్మెల్యే, ఎంపీ రిజ­ర్వే­షన్‌ సీట్లు కేటా­యిం­చాలి.
22. ఎస్టీల రిజ­ర్వే­షన్‌ 7.5% శాతాన్ని, పెరి­గిన జనాభా ఆధా­రంగా కేంద్ర ప్రభుత్వం 14 శాతా­నికి  పెంచాలి.
డా. గుగు­లోతు శంకర్‌ నాయక్‌
9908817986
నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad