7వ వేతన సంఘం కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం 2026 చివరి వరకు లేదా 2027 ప్రారంభం నాటికి కేంద్ర ప్రభుత్వానికి 8వ వేతన సంఘం సిఫార్సులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

7వ వేతన సంఘం 2.57 శాతం ఫిట్మెంట్ ప్రకారం కనీసం వేతనం రూ.7000 నుండి రూ. 18,000కి పెరిగింది. అదేవిధంగా పెన్షన్ మొత్తం రూ. 3500 నుండి రూ. 9,000 కు పెరిగింది. అయితే 8వ వేతన కమిషన్ విషయంలో ఫిట్మెంట్ 2.86 ఉండాలని ఉద్యోగులు పట్టు బడుతున్నారు.

8వ వేతన సంఘం 2.86 శాతం ఫిట్మెంట్ ప్రకారం అమలు చేస్తే లెవల్ వన్ ఉద్యోగులకు కనీసం వేతనం రూ. 18,000 నుండి రూ. 51,000 కు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కనీస పెన్షన్ రూ. 35,000 వరకూ పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

లెవల్ 3 (గ్రేడ్ పే 2000): బేసిక్ జీతం దాదాపు రూ. 57,456, మొత్తం జీతం రూ. 74,845.. తగ్గింపుల తర్వాత చేతికి దాదాపు రూ. 68,849 జీతం అందుతుంది.
లెవల్ 6 (గ్రేడ్ పే 4200): బేసిక్ జీతం దాదాపు రూ. 93,708, మొత్తం జీతం రూ. 1,19,798.. చేతికి జీతం దాదాపు రూ. 1,09,977 అందుతుంది.

లెవల్ 9 (గ్రేడ్ పే 5400): మూల జీతం రూ. 1,40,220, మొత్తం జీతం రూ. 1,81,073.. కటింగ్స్ తర్వాత దాదాపు రూ. 1,66,401 అందుతుంది.
లెవల్ 11 (గ్రేడ్ పే 6600): బేసిక్ రూ. 1,84,452, మొత్తం జీతం రూ. 2,35,920, చేతికి జీతం దాదాపు రూ. 2,16,825 అందుతుంది.

8వ వేతన సంఘం అధికారికంగా తన సిఫార్సులను విడుదల చేసిన తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటిస్తారు. ఎనిమిదవ వేతన సంఘం అమలుతో, ప్రభుత్వ వ్యయంలో భారీ పెరుగుదల ఉండవచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుచేత కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్షతర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.