బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 50 ఏళ్ల అమీషా పటేల్ ఈ విషయాలపై మాట్లాడారు. కేవలం తన కెరీర్ కోసమే ఎన్నో పెళ్లి ప్రతిపాదనలను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు.
తనను పెళ్లి చేసుకోవాలనుకున్న చాలా మంది, పెళ్లి తర్వాత నటన పూర్తిగా మానేసి, ఇంటికే పరిమితం కావాలని షరతు పెట్టారని ఆమె తెలిపారు. అయితే, తన కెరీర్ను అంత సులువుగా వదులుకోవడానికి ఇష్టపడక, అలాంటి ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించినట్లు స్పష్టం చేశారు.
తనను పెళ్లి చేసుకోవాలనుకున్న చాలా మంది, పెళ్లి తర్వాత నటన పూర్తిగా మానేసి, ఇంటికే పరిమితం కావాలని షరతు పెట్టారని ఆమె తెలిపారు. అయితే, తన కెరీర్ను అంత సులువుగా వదులుకోవడానికి ఇష్టపడక, అలాంటి ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించినట్లు స్పష్టం చేశారు.
ఇద్దరి కుటుంబ నేపథ్యాలు, అభిరుచులు కలిసినా, తాను నటిగా మారుతానని చెప్పినప్పుడు, పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి వద్దని తన పార్ట్నర్ చెప్పడంతో ప్రేమను వదులుకుని కెరీర్ను ఎంచుకున్నట్లు ఆమె వివరించారు.
తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, సరైన, అర్హత ఉన్న వ్యక్తి దొరికితే తప్పకుండా చేసుకుంటానని అమీషా అన్నారు. తనకు ఇప్పటికీ మంచి కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, తనలో సగం వయసున్న వారు కూడా డేటింగ్కు ఆహ్వానిస్తున్నారని తెలిపారు.
తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, సరైన, అర్హత ఉన్న వ్యక్తి దొరికితే తప్పకుండా చేసుకుంటానని అమీషా అన్నారు. తనకు ఇప్పటికీ మంచి కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, తనలో సగం వయసున్న వారు కూడా డేటింగ్కు ఆహ్వానిస్తున్నారని తెలిపారు.
ఇక అమీషా పటేల్ కెరీర్ విషయానికొస్తే, గతేడాది ‘గదర్ 2’ చిత్రంతో భారీ బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. సన్నీ డియోల్తో కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.686 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమె ‘తౌబా తేరా జల్వా’ అనే చిత్రంలో కనిపించారు.