DA Hike 2025: ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హోలీ, దీపావళి పండుగల సమయాల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

హోలీ పండుగ సందర్భంగా మార్చిలో 2శాతం డీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది 2025 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. తదుపరి డీఏ జులై 2025 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. రాఖీ పండుగ తర్వాత ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు AICPI INDEX గణాంకాలను పరిశీలిస్తే, డీఏ 2 నుండి 3 శాతం మధ్య పెరుగుతుందని అంచనా. ఈ పెంపుతో ఉద్యోగుల డీఏ గతంలో ఉన్న 55 శాతం నుంచి 57 శాతానికి పెరుగుతుంది.

డీఏ 2శాతం పెరిగితే, 18,000 బేసిక్ జీతం పొందుతున్న వారికి రూ. 10,260 ప్రయోజనం లభిస్తుంది. అదే 3శాతం పెరిగితే, వారికి రూ. 10,440 ప్రయోజనం లభిస్తుంది. కొత్త డీఏ అమలు జూలై 2025 నుండి అమల్లోకి రానుంది. దీపావళి కానుకగా ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం రూ.50 వేలుగా పరిగణిస్తే అందులో గత డీఏ 55 శాతం అంటే రూ.26,500గా ఉంటుంది. ప్రస్తుతం రెండు శాతం డీఏ పెంచితే 57 శాతం కింద రూ.27, 500 అవుతుంది. ఇలాగే వివిధ స్కేల్స్ కింద వేతనాన్ని అందుకుంటున్న ఉద్యోగుల జీతంలో కూడా డీఏ పెంపు ఉంటుంది.

ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఏ పెంచుతూ ఉంటుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమలులో ఉండగా.. ఇటీవలే 8వ వేతన సంఘం ఏర్పాటుకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.