రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తన స్టైలిష్ లుక్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆకుపచ్చ రంగు చీరలో, దానికి తగినట్లుగా ప్రత్యేకమైన నెక్లెస్తో నీతా అంబానీ ఎంతో హుందాగా కనిపించారు.
ఈవెంట్కు హాజరైన వారందరిలోనూ నీతా అంబానీ డ్రెస్సింగ్ స్టైల్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. ఈ సిరీస్ ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా బుధవారం రాత్రి ముంబయిలో చిత్ర యూనిట్ ఓ ప్రీమియర్ షోను ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో సహా విచ్చేశారు.
భర్త ముఖేశ్తో కలిసి నీతా అంబానీ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ కార్యక్రమానికి ఎలా హాజరు కావాలో నీతా అంబానీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.