బాబా వంగా జ్యోతిష్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే? ఆమె ముందు జరగబోయే ఎన్నో సంఘటనల గురించి తెలియజేసి వార్తల్లో నిలిచారు.
బల్గేరియాలో జన్మించిన బాల్కన్స్ నోస్ట్రాడమస్ బాబా వంగాగా ప్రసిద్ధి చెందారు. ఈమె ఒక అంధ ఆధ్యాత్మికవేత్త. చిన్నతనంలోనే తన కంటి చూపు కోల్పోయింది. అయితే, 1996లో బాబా వంగా మరణించినప్పటికీ ఆమె ప్రవచనాలకు మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంది.
బాబా వంగా భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పారు. అందులో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, కరోనా, 9/11 దాడులు వంటి అనేక ఘటనలు నిజం అయ్యాయి. దీంతో ఈమె ప్రవచనాలపై ప్రజలకు ఎక్కువ ఆసక్తికలగడం మొదలైంది.
అంతేకాకుండా బాబా వంగా 2026లో జరిగే ఇంకొన్ని సంఘటనల గురించి కూడా తెలిపారు. అందులో మూడో ప్రపంచ యుద్ధం ఒకటి. 2023లో మూడో ప్రపంచ యుద్ధం మొదలు అవుతుందని ఆమె అంచనా వేసినట్లు సమాచారం.
అయితే 2026 సంవత్సరానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశారు. ఆమె అంచనా వేసిన వాటిలో ప్రకృతి వైపరిత్యాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటాలు, వాతావరణ మార్పలు, భూగర్భంలో ఎనిమిది శాతం ప్రభావితం అవుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న కొన్ని ఉద్రిక్తతలు, తైవాన్ ను చైనా స్వాధీనం చేసుకొని ఉన్నతశిఖరాలకు చేరడం, రష్యా, అమెరికా మధ్య ప్రత్యక ఘర్షణ వంటివి రాబోయే సంవత్సరానికి ఆమె అంచనాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే, ప్రస్తుతం ఏఐ పరుగులు పెడుతోంది. అయితే 2026 నాటికి అది మరింత విస్తరించడమే కాకుండా, ఏఐ గణనీయమైన పురోగతి సాధించి, మానవ వాళిపై దాని అధిపత్యం చేలాయిస్తుందని బాబా వంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా దీని వలన అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.
అదే విధంగా బాబా వంగా భూమిపైకి వచ్చే గ్రహాంతర వాసుల గురించి కూడా కొన్ని విషయాలను అంచనా వేసినట్లు తెలుస్తోంది. గ్రహాంతవాసులతో మొదటి పరిచయం 2026 నవంబర్ లో జరుగుతుందని ఆమె తన జ్యోతిష్యంలో తెలిపారు. అలాగే భూమి వాతవరణంలోకి పెద్ద అంతరిక్ష నౌక ప్రవేశించడం గురించి కూడా ఆమె తెలియజేశారు.