Saturday, November 15, 2025
Homeగ్యాలరీTyphoon Kalmegi: కల్మేగీ బీభత్సం.. 85కు చేరిన మృతుల సంఖ్య!

Typhoon Kalmegi: కల్మేగీ బీభత్సం.. 85కు చేరిన మృతుల సంఖ్య!

Typhoon Kalmegi: ఫిలిప్పీన్స్‌ను కల్మేగీ తుపాను హడలెత్తిస్తోంది. దేశ మధ్య ప్రాంతంలోని సెబు, ఈస్టర్న్‌ సమర్, గుయిమరస్, బొహొల్, పలవన్‌ ప్రావిన్స్‌లపై తుపాన్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో 85 మంది మృతి చెందగా.. మరో 76 మంది గల్లంతయ్యారు.

- Advertisement -
ఫిలిప్పీన్స్‌లో కల్మేగీ తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో 85 మంది మృతి చెందగా.. మరో 76 మంది గల్లంతయ్యారు.
భారీ వరదలకు పలువురు ఇళ్లలోనే చిక్కుకుపోగా.. డజన్లకొద్దీ కార్లు కొట్టుకుపోయాయని ఫిలిప్పీన్స్‌ అధికారులు వెల్లడించారు.

ఇళ్లను వరద ముంచెత్తడంతో సహాయం కోసం ప్రజలు ఇళ్ల పైకప్పులు ఎక్కి.. రక్షించాలంటూ వందల సంఖ్యలో ప్రజలు అధికారులను వేడుకున్నారు.

కల్మేగీ తుపాను ప్రభావంతో సెబూలో అధిక ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఇక్కడ 49 మంది మృత్యువాతపడ్డారని, 13 మంది గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు.
దేశ మధ్య ప్రాంతంలోని సెబు, ఈస్టర్న్‌ సమర్, గుయిమరస్, బొహొల్, పలవన్‌ ప్రావిన్స్‌లపై తుపాన్ తీవ్రత అధికంగా ఉంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad