Sunday, November 16, 2025
HomeTop StoriesSoaked Dates Benefits:పరగడుపునే నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏమౌతుందో తెలుసా!

Soaked Dates Benefits:పరగడుపునే నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏమౌతుందో తెలుసా!

Health Benefits of Soaked Dates:మన ఆహారంలో చిన్న మార్పులు కూడా పెద్ద ఆరోగ్య మార్పులకు దారితీస్తాయి. అలాంటి మార్పులో ఒకటి రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం. ముఖ్యంగా రాత్రిపూట నీటిలో నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే తినడం శరీరానికి అనేక రకాల మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం శక్తినిచ్చే పండ్లు కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలను అందిస్తాయి.

- Advertisement -

ఖర్జూరాలు సహజంగా తీపిగా ఉండే పండ్లు అయినా వాటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నానబెట్టిన ఖర్జూరాలు తినడం వలన పేగుల కదలిక సక్రమంగా జరుగుతుంది. తరచుగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడే వారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వలన ఆహారం సరిగ్గా జీర్ణమై శరీరానికి శక్తిని అందిస్తుంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/five-zodiac-signs-to-get-luck-from-sun-transit-2026/

హీమోగ్లోబిన్ స్థాయిని ..

ఇందులో ఉన్న ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దీని వలన రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. తరచుగా అలసటగా, బలహీనంగా అనిపించే వారికి రోజూ కొన్ని నానబెట్టిన ఖర్జూరాలు తినడం ద్వారా శక్తి పెరుగుతుంది. ఐరన్‌తో పాటు మెగ్నీషియం, రాగి, మాంగనీస్ వంటి ఖనిజాలు శరీర పనితీరుకు అవసరమైన మద్దతునిస్తాయి.

ఖర్జూరాల్లోని విటమిన్ సి, విటమిన్ బి సమూహాలు (B1, B2, B3, B5), విటమిన్ A వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వలన వైరస్‌లు, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను శరీరం ఎదుర్కోవడంలో సులభతరం అవుతుంది. ఇది ముఖ్యంగా సీజనల్ ఫ్లూ, జలుబు, దగ్గు వంటి సమస్యల సమయంలో రక్షణగా పనిచేస్తుంది.

ఎముకలు బలహీనంగా

వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నానబెట్టిన ఖర్జూరాల్లో ఉన్న మెగ్నీషియం, రాగి, సెలీనియం వంటి ఖనిజాలు ఎముకల దృఢత్వాన్ని కాపాడుతాయి. ఇవి క్రమంగా తీసుకోవడం వలన ఎముకల నొప్పులు తగ్గి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు. కేవలం వృద్ధులకు మాత్రమే కాదు, యువతలో కూడా ఇవి ఎముకల బలం పెంచడానికి సహాయపడతాయి.

మెదడు ఆరోగ్యాన్ని…

మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా నానబెట్టిన ఖర్జూరాలు పాత్ర ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షించడంలో తోడ్పడతాయి. మతిమరుపు, అల్జీమర్స్ వంటి నరాల సమస్యలు రాకుండా నిరోధించే శక్తి ఇవి కలిగిస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గించి, దృష్టి కేంద్రీకరణను పెంచడంలో కూడా సహాయపడతాయి.

చర్మ సౌందర్యం..

చర్మ సౌందర్యం విషయంలో కూడా ఖర్జూరాలు అద్భుత ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలను తరచుగా తినడం వలన శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులోని విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాల పునరుద్ధరణలో తోడ్పడతాయి. పొడిబారిన చర్మం, చర్మ మచ్చలు వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.

డిటాక్స్ ప్రక్రియ…

నానబెట్టిన ఖర్జూరాలు డిటాక్స్ ప్రక్రియలో కూడా ఉపయోగపడతాయి. రాత్రి మూడు లేదా నాలుగు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఉత్తమం. ఆ నీటిని కూడా తాగడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు తొలగుతాయి. ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచి, కొత్త శక్తిని అందిస్తుంది.

హృదయ ఆరోగ్యానికి..

వన్నీ కాకుండా ఖర్జూరాలు హృదయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటు స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిత్య జీవితంలో పిండి పదార్థాలు ఎక్కువగా తినేవారు, శరీరానికి శక్తి అవసరమైనవారు ఖర్జూరాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజ శక్తి లభిస్తుంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/signs-that-show-your-family-is-affected-by-kuladevata-anger/

ఉష్ణోగ్రతను సమతుల్యం..

నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో కూడా తోడ్పడతాయి. వేసవిలో ఇవి శరీరానికి తేలికపాటి శక్తిని అందిస్తే, చలికాలంలో వేడి ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ కారణంగా అన్ని రుతువులలోనూ ఇవి ఉపయోగపడే పండ్లుగా భావిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad