Dates For Diabetes: మనం ఆరోగ్యంగా ఉండాలన్న, రోజంతా శక్తివంతంగా ఉండాలన్న మన డైట్ లో డ్రై ఫ్రూట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నేపథ్యంలో ఖర్జూరం విషయానికి వస్తే దీని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అయితే మధుమేహ రోగులు దీని తినడం సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో షుగర్ ఉన్నవారు ఖర్జూరం తినాలా వద్దా అనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, సహజ చక్కెర పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ లో చేర్చారు. మధుమేహరవులు ఖర్జూరం తినే ముందు దాని ప్రయోజనాలు, అప్రయోజనాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
మధుమేహ రోగులు ఖర్జురాలు తింటే కలిగే ప్రయోజనాలు
ఖర్జూరంలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఖర్జూరం తినడం ద్వారా చక్కెర శోషణ ప్రక్రియ నిమ్మతిస్తుంది. ఇది రక్తంలో చక్కెరలో ఆకస్మిక పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇందులో ప్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరం షుగర్ ఉన్నవారికి పరిమిత పరిమాణంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా వీటిని తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా ఎముకలను బలంగా చేస్తాయి.
మధుమేహ రోగులు ఖర్జురాలు తింటే కలిగే అప్రయోజనాలు
ఖర్జూరాల గ్లైసేమిక్ సూచిక చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఖర్జూరాలను అధిక పరిమాణంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కావున, ఖర్జూరాలను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను ఎక్కువ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయి.
మధుమేహరోగులు ఖర్జూరాన్ని తరచుగా తినకూడదు. ఇలా తినడం ద్వారా రక్తంలో చక్కర స్థాయిలను క్రమంగా పెంచుతుంది.
మధుమేహ రోగులు ఎన్ని ఖర్జూరాలు తినాలి
మధుమేహరోగులు రోజుకు 1-2 ఖర్జూరాల కంటే ఎక్కువ తినకూడదు. అది కూడా బాదం, వాల్నట్లు లేదా పాలు వంటి ఇతర తక్కువ గ్లైసేమిక్ సూచిక హారాలతో కలిపి వీటిని తినాలి. ఇది చక్కెర ప్రభావాన్ని తగ్గిస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


