Dried Fish Health Benefits: చేపలతో తయారు చేసే వంటలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా తీరప్రాంతాలలో ఉండే వారి ఎండు చేపలు ఒక అద్భుతమైన ఆహారం. ఇవి రుచికరమైనవి అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కలిగినది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.
ప్రోటీన్ అధికంగా లభించే ఆహారంలో ఎండు చేపలు ఒకటి. ఇది కండరాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, శరీరాన్ని దృఢంగా తయారు చేస్తుంది. దీని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఎండు చేపలలో ఒమేగా-3 అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది, రక్తపోటు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. వీటిని పిల్లలు తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
ఎముకలను గట్టి చేయడంలో కూడా ఎండు చేపలు సహాయపడుతాయి. ఇందులో ఉండే విటమిన్ డి, కాల్షియం ఆస్టియోపొరోసిస్ సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులను నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. విటమిన్ బి-12 తక్కువగా ఉన్నవాళ్ళు ఎండు చేపలు తినవచ్చు. ఇది నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ చేపలలో కాల్షియం, సెలీనియం,ఐరన్, జింక్ ఇతర పోషకాలు ఉన్నాయి.
ఆరోగ్యనిపుణుల ప్రకారం రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు చేపలు తినడం వల్ల రక్తం ఉత్పత్తి చెందుతుంది. సెలీనియం, అయోడిన్ ఎక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా దీని తినవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఉంటే ఎండు చేపలు తినవచ్చు. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుచుతుంది.
అయితే ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికి వీటిని తినే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉప్పు అధికంగా ఉండటం వల్ల రక్తపోటు ఉన్నవాళ్ళు తక్కువగా తినడం మంచిది. అలాగే వీటిని కొంత సమయం వరకు నీటిలో ఉంచి ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది. దీంతో పాటు దగ్గు, జలుబు, ఆస్తమా న్నవారు ఎండు చేపలు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అల్సర్ ఉన్నవారు కూడా ఎండు చేపలకు దూరంగా ఉండాలి ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. జ్వరం, దగ్గు ఉన్నప్పుడు కూడా ఎండు చేపలు తినకూడదు.