Saturday, November 15, 2025
Homeహెల్త్Karnataka Menstrual Leave Policy : గుడ్ న్యూస్.. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నెలసరి...

Karnataka Menstrual Leave Policy : గుడ్ న్యూస్.. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు

Karnataka Menstrual Leave Policy : మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక సౌకర్యాన్ని పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన ‘నెలసరి సెలవు’ (Menstrual Leave) ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వస్త్రపరిశ్రమ, ఐటీ కంపెనీలు, బహుళజాతి సంస్థలు, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళలకు వర్తిస్తుంది. ఈ నిర్ణయం మహిళల భాగస్వామ్యాన్ని పెంచి, వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌కు దోహదపడుతుందని అధికారులు అంచనా.

- Advertisement -

ALSO READ: Pregnant: తప్పని తిప్పలు.. ప్ర‌స‌వం కోసం బురద రోడ్డులో 1.5 కి.మీ. న‌డిచిన గ‌ర్భిణీ

క్యాబినెట్ సమావేశం తర్వాత న్యాయశాఖ మంత్రి ఎచ్.కె. పాటిల్ మాట్లాడుతూ, “శ్రామిక మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. నెలసరి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు మానసిక, శారీరక సౌకర్యం అందించాలన్నదే మా ఉద్దేశం. ఈ సెలవు ఉద్యోగినులకు ఎంతగానో ఉపకరిస్తుంది. బిహార్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అందుకే మా రాష్ట్రంలో కూడా ఇది అమలు చేస్తాము” అని వివరించారు. ఈ సెలవు మహిళల పని దక్షతను పెంచి, డ్రాప్‌ఔట్ రేట్‌ను తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

కర్ణాటకలో 45% మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఐటీ, వస్త్రపరిశ్రమల్లో 60% మహిళలు పనిచేస్తున్నారు. నెలసరి సమస్యల వల్ల 20% మహిళలు పని రోజులు కోల్పోతున్నారని స్టడీలు చెబుతున్నాయి. ఈ సెలవు అమలుతో మహిళల పార్టిసిపేషన్ 10% పెరుగుతుందని అంచనా. జొమాటో, స్విగ్గీ, ఎల్&టీ, గూగుల్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ సెలవు ఇస్తున్నాయి. స్పెయిన్, జపాన్, దక్షిణ కొరియాలో ఇది సాధారణం. భారత్‌లో బిహార్ (2023) మొదటి రాష్ట్రంగా అమలు చేసింది. కేరళలో 2024లో విస్తరించారు. ఒడిశా, సిక్కిం కూడా అమలులో ఉన్నాయి.

మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగె స్వాగతించారు. “ఇది మహిళల భాగస్వామ్యానికి దోహదపడుతుంది. అసంఘటిత రంగాల్లో సవాళ్లు ఉన్నా, ప్రభుత్వం ముందుండాలి” అని చెప్పారు. కొందరు “సెలవు పెరిగి పని భారం పెరుగుతుంది” అని విమర్శలు చేస్తున్నారు. కానీ నిపుణులు “ఇది ప్రొడక్టివిటీ పెంచుతుంది” అని స్పష్టం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ విధానాన్ని 2026 జనవరి నుంచి అమలు చేయాలని ప్రణాళిక. మహిళలకు మరింత సౌకర్యం, అవగాహన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు మోడల్ అవుతుందని ఆశాభావం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad