Sunday, February 23, 2025
Homeహెల్త్Medicover: మెడికవర్ లో ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్

Medicover: మెడికవర్ లో ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్

క్యాన్సర్ పేషెంట్స్

క్యాన్సర్ చికిత్సలో పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి, ప్రతి రోగికి వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పోషకాహార మార్గదర్శకత్వం అందించేలా సరికొత్త చికిత్సా విధానాల్లో ఒకటైన ఆంకో న్యూట్రిషన్ ను ప్రారంభించింది మెడికవర్ ఆసుపత్రి. సరైన పోషకాహారం – క్యాన్సర్ చికిత్సల ఫలితాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రపోషించేలా ఈ ప్రోగ్రాను రూపొందించటం విశేషం. క్యాన్సర్ చికిత్సలంటేనే కొన్ని నెలల నుండి సంవత్సరాల పాటు కొనసాగుతాయి. చాలా క్యాన్సర్ చికిత్సలు దుష్ప్రభావాలు కలిగిస్తాయి. నోటి పుండ్లు, ఆకలి లేకపోవడం, అలసట, వికారం, వాంతులు, రుచి కోల్పోవడం మొదలైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. ఈ దుష్ప్రభావాల వల్ల సరిగా ఆహారం తీసుకోలేక పోవచ్చు, లేదా తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించలేక పోవచ్చు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రూపొందించిన శక్తివంతమైన మందులు, చికిత్సా విధానాలను తట్టుకోవడానికి శరీరానికి సరైన పోషకాహారం అవసరం.

- Advertisement -

డైట్ ప్లాన్

ఇటువంటి పోషకాహారం క్యాన్సర్ చికిత్సా సమయంలో బలంగా ఉండడానికి, దుష్ప్రభావాలను నియంత్రించడంలో కూడా మంచి ఆహారం సహాయం చేస్తుంది. సరైన ఆహారం క్యాన్సర్ చికిత్సను కొనసాగించడానికి, మరింత శక్తితో బలంగా ఉండటానికి సహాయపడుతుంది. చికిత్స విజయానికి కీలకం. ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మా డైటీషియన్ మీ క్యాన్సర్ రకం, చికిత్స రకం, మీ ప్రస్తుత శారీరక, వైద్య పరిస్థితి అనుగుణంగా క్యాన్సర్ చికిత్సలను తట్టుకొని, త్వరగా కోలుకోవడానికి శరీరానికి ఉపయోగపడేలా రూపొందించబడతాయి. మీ రోజువారీ పోషకాహార అవసరాల ఆధారంగా, తయారీ విధానాలతో పాటు మీకు భోజన ప్రణాళిక (Diet Plan) అందిస్తారు. తగిన పోషకాహారం తీసుకోవడం వలన శస్త్ర చికిత్స, కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సల తర్వాత బరువు తగ్గకుండా ఉండేందుకు, త్వరగా కోలుకోవడానికి సాయపడుతుంది.


కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అమిత్ జోత్వాని ఈ కార్యక్రమంపై మాట్లాడుతూ, “క్యాన్సర్ చికిత్స కేవలం వ్యాధిని నయం చేయడం మాత్రమే కాదు, రోగులు త్వరగా కోలుకోవడం, వారి శక్తిని తిరిగి పొందడం ఎంతో ముఖ్యం. పోషకాహారం ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్’ ద్వారా మేము రోగుల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉన్నాము.” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో డాక్టర్ ప్రశాంత్ రెడ్డి (కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్), డాక్టర్ సరిత శ్రీవాస్తవ (మెడికల్ & హీమటో ఆంకాలజిస్ట్), డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ రఘుకాంత్ (పల్మనాలజిస్ట్), డాక్టర్ శ్రీలత (న్యూట్రిషనిస్టు & డైటీషియన్), సెంటర్ హెడ్ సువంకర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News