Saturday, November 15, 2025
Homeహెల్త్Health: పసుపు నీరు తాగుతున్నారా..? వామ్మో.. అయితే ఆ ప్రాబ్లెమ్స్‌ మీ వెంటే

Health: పసుపు నీరు తాగుతున్నారా..? వామ్మో.. అయితే ఆ ప్రాబ్లెమ్స్‌ మీ వెంటే

Turmeric Water Side Effects:ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలిపి తాగడం ఇప్పుడు చాలా మంది అలవాటు చేసుకున్నారు. ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతూ అనేక మంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శరీరానికి అవసరమైన అనేక రకాల గుణాలను కలిగి ఉంటుందని పరిశోధనలు చూపుతున్నాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, ఆక్సిడెంట్లను నియంత్రించడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఈ పానీయం వలన కలిగే లాభాలు ఎంత ఉంటాయో, దాని వల్ల సమస్యలు కూడా రావచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

జీర్ణక్రియ సమస్యల…

జీర్ణక్రియ సమస్యల విషయంలో పసుపు నీరు కొంతమేరకు ఉపయోగకరమే. అది జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహకరిస్తుంది. కానీ అధిక మోతాదులో తాగితే శరీరం తట్టుకోలేకపోవచ్చు. పరిశోధనల ప్రకారం ఎక్కువ పసుపు తీసుకున్నవారిలో కడుపు నొప్పి, వాంతులు, యాసిడ్ రిఫ్లక్స్, విరేచనాలు వంటి సమస్యలు కనిపించాయి. అందువల్ల పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/rare-partial-solar-eclipse-on-september-21-2025-visible-in-new-zealand/

రక్తంపై ప్రభావం..

మరొక ముఖ్యమైన విషయం రక్తంపై ప్రభావం. పసుపులో రక్తాన్ని పలచబరిచే గుణం ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా సహాయం చేస్తుంది. కానీ గాయాలు జరిగితే రక్తం ఆగకుండా ఎక్కువగా కారిపోవడానికి కారణమవుతుంది. ఇప్పటికే రక్తాన్ని పలచబరిచే మందులు తీసుకునే వారు లేదా రక్తస్రావ సంబంధిత వ్యాధులు ఉన్నవారు పసుపు నీరు తాగే ముందు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి. లేని పక్షంలో ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.

ఐరన్ శోషణ…

ఐరన్ శోషణ తగ్గించడం కూడా మరో సమస్య. అధిక మోతాదులో పసుపు వాడినప్పుడు శరీరంలో ఐరన్ తీసుకునే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుందని అధ్యయనాలు తెలిపాయి. కొన్ని నివేదికల ప్రకారం ఐరన్ శోషణ 20 శాతం నుండి 90 శాతం వరకు తగ్గిపోవచ్చు. దీని ప్రభావం కొంత కాలం తర్వాత రక్తహీనతగా మారవచ్చు. ఒక సందర్భంలో అధిక మోతాదులో పసుపు సప్లిమెంట్లు తీసుకున్న వ్యక్తికి రక్తహీనత వచ్చినట్లు నమోదైంది.

కాలేయం కూడా…

కాలేయం కూడా పసుపు అధిక మోతాదును తట్టుకోలేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తక్కువ మోతాదులో తీసుకుంటే సమస్య లేదు. కానీ ఎక్కువగా సప్లిమెంట్లు తీసుకుంటే కాలేయానికి హాని కలగవచ్చు. ఇప్పటికే కాలేయ వ్యాధులు ఉన్నవారు దీనిని తరచూ లేదా అధికంగా వాడితే సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అరుదుగా అయినా తీవ్రమైన కాలేయ వైఫల్యానికి దారితీసిన సందర్భాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

అలెర్జీ సమస్యలు..

కొంతమందికి పసుపు వల్ల అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, గజ్జి, వాపు వంటి ప్రతిచర్యలు కనిపించవచ్చు. అలాంటి లక్షణాలు గమనించిన వెంటనే పసుపు నీటిని తాగడం ఆపేసి డాక్టర్‌ని సంప్రదించడం అవసరం. లేకపోతే సమస్య ఎక్కువ కావచ్చు.

Also Read: https://teluguprabha.net/lifestyle/banana-peel-health-and-beauty-benefits-revealed/

లాభాలు ఉన్నప్పటికీ….

పసుపు నీరు వలన లాభాలు ఉన్నప్పటికీ, దాన్ని ఎంత మోతాదులో, ఎలా వాడాలో అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. అధిక మోతాదులో తీసుకుంటే ప్రయోజనాల కంటే హానికర ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వైద్య సలహా తీసుకుని, శరీర పరిస్థితిని బట్టి మాత్రమే పసుపు నీటిని ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad