Kenya landslide: ఆఫ్రికా దేశమైన కెన్యాలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన కెన్యా దక్షిణ ప్రాంతంలోని మారాక్వెట్ కౌంటీలో సంభవించింది. వర్షాకాలం కావడంతో ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయని కెన్యా అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు (రెస్క్యూ ఆపరేషన్) కొనసాగుతున్నాయని అన్నారు. కొండచరియల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నట్టుగా సదరు మంత్రి తెలిపారు. ఈ ఘటనతో మారాక్వెట్ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది.


