Manisha Koirala: నేపాల్లో అనూహ్యంగా హింస అంతకంతకు పెరుగుతోంది. సోమవారం నిరసనకారుల ప్రధాన డిమాండ్ అయిన సోషల్ మీడియాపై నిషేధం ఎత్తి వేసినప్పటికీ మంగళవారం అది మరోరూపం తీసుకుంది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలీ ప్రైవేటు ఇల్లు సహా అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్ ఇల్లును కూడా తగులబెట్టారు. నేపాల్ పార్లమెంటులోకి చొచ్చుకెళ్లి భవనానికి నిప్పు పెట్టారు. దీంతో నేపాల్ ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యం ప్రధాని ఒలీ తన పదవికి రాజీనామా చేశారు.
అటు మాజీ ప్రధాని పుష్పకుమార్ దహల్, ఇతర ప్రముఖులు, రాజకీయ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగలు..కొన్ని చోట్ల ధ్వంసం చేస్తున్నారు.
తన దేశంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటి మనీషా కోయిరా స్పందించారు. రక్తంతో తడిసిన బూటు ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ మంగళవారం ‘బ్లాక్ డే’ కామెంట్ చేశారు. ‘ఈ రోజు నేపాల్కు బ్లాక్ డే. అవినీతి, న్యాయంకోసం ప్రజల నుంచి ఉద్యమం డిమాండ్, గొంతుకు బుల్లెట్లు సమాధానం చెబుతున్నాయి’ అంటూ ఆవేదనను వెలిబుచ్చారు.
దీంతోపాటు నేపాల్ ప్రజలు ఏమీ కోరుకుంటున్నారనే అంశంపై పబ్లిష్ అయిన పలు ఆర్టికల్స్ షేర్ చేశారు. 1970లలో నేపాల్లో జన్మించిన మనీషా పలు నేపాలీ సినిమాల్లో నటించారు. అనంతరం భారత్లో పలు భాషల్లో నటించి మెప్పించారు. కాగా ఆమె కుంటుంబం నేపాల్లో రాజకీయాల్లో ఉంది.
ఏమిటీ జెన్ జీ నిరసన
నేపాల్ ప్రభుత్వం దాదాపు 26 దాకా సోషల్ మీడియా ప్లాట్ఫాంలను దేశంలో బ్యాన్ చేసింది. అందులో ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రాం, స్నాప్చాట్ వంటివి ఉన్నాయి. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జెన్ జీ ఆందోళన పేరుతో ఖాఠ్మండులో భారీ ఎత్తున నిరసనకు దిగారు. అది పోలీసుల కాల్పుల దాకా వెళ్లింది. ఈ కాల్పుల్లో దాదాపు మంది చనిపోగా దాదాపు 300 దాకా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తి వేసింది.
అయితే హింసకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
మరోవైపు మంగళవారం నిరసనకారులు ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని, ఆశ్రిత పక్షపాతం పెరిగిందని డిమాండ్ చేస్తూ మళ్లీ రోడ్లమీదకు వచ్చారు. అంతేకాదు నేరుగా ప్రధాని, అధ్యక్షుల ప్రైవేటు నివాసాలకు నిప్పు పెట్టారు. దీంతో హింస పెరిగింది. ప్రస్తుత సంఘటనలతో ప్రధాని ఒలీ రాజీనామా చేశారు.
అంతకుముందు ఈ హింస వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అయితే ఒలీ రాజీనామా అనంతరం విదేశాలకు పారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.


