Homeఇంటర్నేషనల్Joe Biden: మన్మోహన్ సింగ్‌ మృతిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతాప సందేశం

Joe Biden: మన్మోహన్ సింగ్‌ మృతిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతాప సందేశం

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూతపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాప సందేశాన్ని విడుదల చేశారు. మన్మోహన్ సింగ్‌ వ్యూహాత్మక ముందుచూపు, రాజకీయ ధైర్యంతో భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరో స్థాయికి చేర్చారంటూ కొనియాడారు. అంకితభావం ఉన్న ప్రజాసేవకుడు, దయాగుణం, వినమ్రత కలిగిన వ్యక్తి అని కీర్తించారు.

- Advertisement -

ఆయనను కోల్పోయిన ఈ కష్టకాలంలో భారత ప్రజలతో పాటు తాము కూడా దుఃఖిస్తున్నాం. మన్మోహన్ సింగ్ దార్శనికతను గుర్తుచేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు పిల్లలు, భారతదేశ ప్రజలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించారు. అమెరికా-భారత్ పౌర అణు ఒప్పందం నుంచి ఇండో-పసిఫిక్ భాగస్వామ్య దేశాల మధ్య క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేయడం వరకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. భవిష్యత్ తరాల కోసం ఇరు దేశాలను, ప్రపంచాన్ని పటిష్ఠం చేయడంలో పురోగతికి ఆయన బాటలు వేశారని గుర్తుచేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News