Thursday, June 12, 2025
Homeఇంటర్నేషనల్ఆస్ట్రియాలోని స్కూల్‌లో స్టూడెంట్ కాల్పులు.. 11 మంది మృతి..!

ఆస్ట్రియాలోని స్కూల్‌లో స్టూడెంట్ కాల్పులు.. 11 మంది మృతి..!

ఆస్ట్రియాలోని ఓ పాఠశాలలో మంగళవారం ఉదయం ఊహించని విధంగా ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్లో స్టూడెంట్ జరిపిన కాల్పుల్లో దాదాపు 11మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడ్డ విద్యార్థి అనంతరం తనను తాను కాల్చుకొని మరణించాడని.. అతడి మృతదేహం పాఠశాలలోని బాత్రూంలో లభ్యమయ్యిందని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

- Advertisement -

ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాలశాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆస్ట్రియాలోని గ్రాజ్‌ నగరంలోని ఓ పాఠశాలలో మంగళవారం ఉదయం ఓ విద్యార్థి చొరబడి రెండు తరగతుల్లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 30కి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.

అతడిని వారించడానికి ప్రయత్నించిన ఉపాధ్యాయురాలిపై పలుమార్లు కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడ్డవారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాఠశాల వద్ద భద్రతా దళాలు మోహరించాయి.

2015 జూన్‌లో గ్రాజ్ ప్రాంతంలో ఇదే తరహాలో జరిగిన కాల్పుల జరిగి పదేళ్లు అవుతుండడంతో దానికి గుర్తుగా విద్యార్థి ఈ కాల్పులకు తెగబడి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News