Iran Internet Bandh: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నేటికి ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయి 864 గంటలు అంటే సుమారు 37 రోజులు పూర్తయింది. ఒక దేశంలో ఇన్ని గంటల పాటు నిరంతరాయంగా ఇంటర్నెట్ బంద్ కావడం ప్రపంచంలోనే ఇది మొదటిసారిగా కావడంతో రికార్డు సృష్టించింది.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-season-19-lsg-beat-srh-by-5-wickets/
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రత దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించింది. దీంతో దాదాపు 37 రోజులుగా కొనసాగుతున్న ఈ షట్డౌన్ వల్ల ఇరాన్ పౌరులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో గతంలో నమోదైన అన్ని రికార్డులను ఇరాన్ అధిగమించింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన జాతీయ స్థాయి షట్డౌన్గా నిలిచింది. ఈ మేరకు డిజిటల్ వాచ్డాగ్ NetBlocks సమాచారం వెల్లడించింది.
ఇరాన్లో సాధారణ ఇంటర్నెట్ సేవలతో పాటు VPNలు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లు, స్టార్లింక్ సేవలను కూడా ప్రభుత్వం ‘కిల్ స్విచ్’ పరికరాల ద్వారా నియంత్రించింది. దీంతో ఆ దేశంలో ఈ సుదీర్ఘ షట్డౌన్ వల్ల ఇరాన్ ప్రభుత్వం ప్రతి గంటకు సుమారు 1.56 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నట్లు సమాచారం. అయితే అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బ్లాక్అవుట్ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

