Strait of Hormuz: హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు తాజాగా ఇరాన్ ప్రకటించింది. అంతేకాదు అన్ని వాణిజ్య రాకపోకలకు అనుమతించిననున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు.
ఇరాక్ విదేశాంగ మంత్రి ట్వీట్
ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్-లెబనాల్ సీజ్ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో ఉన్నంత వరకు హర్మూజ్ తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనపై పశ్చిమా దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్, కువైట్, ఖతర్ వంటి అరెబియన్ దేశాలు ఈ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నాయి. కాగా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటనతో నౌకల రాకపోకలు యధావిధిగా కొనసాగనున్నాయి.
లెబనాన్-ఇజ్రామెల్ ఒప్పందం
అదే సమయంలో హర్మూజ్ను తెరవడంతో చమురు ధరలు భారీగా పడిపోయాయి. కాగా, లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా ఈ యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని గురువారం రాత్రి స్వయంగా ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరేందకు లెబనాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ అంగీకారం శుభపరిణామంగా అభిప్రాయపడుతున్నారు.
Also Read: Raashi Khanna: షూటింగ్ సెట్లో హీరోయిన్ రాశీ ఖన్నాకు చేదు అనుభవం

