Social Media: నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధం (బ్యాన్) ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆందోళనలు విరమించాలని నిరసకారులను కోరింది. ఈ మేరకు అర్థరాత్రి దాటిన తర్వాత సమాచారశాఖ మంత్రి పృద్వీ సభా గురుంగ్ ఒక ప్రటకన చేశారు.
గత కొన్ని రోజులుగా దేశంలో వివిధ యాప్లపై నిషేధంచడంతో జెన్ జీ నాయకత్వంతో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. సోమవారం జనం వీధుల్లోకి వచ్చి తీవ్రస్థాయిలో ఉద్యమించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హోంమంత్రి రాజీనామా చేసేంత వరకు పరిస్థితులు వెళ్లాయి.
‘ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేస్తున్నాం. దయచేసి ఆందోళనలు విరమించండి’ అని గురుంగ్ కోరారు.
అయితే నిరసనలో పలువురు చనిపోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండువారాల్లో ఆందోళనలకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపి నివేదిక రెడీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ఎక్స్ తమ దేశ సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచేలా వ్యవహరించిందని ఇంతకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని కేపీ శర్మ ఒలీ మండిపడ్డారు. ఎక్స్ నేపాల్లో రిజిస్టర్ చేసుకోలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో ఒలీ ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్ చట్టాలకు అనుగుణంగా, నిబంధనలు పాటిస్తూ తమ దేశంలోకి ఎంటర్ కావాలని సంవత్సరంన్నర కాలంగా చెబుతున్నా ఎక్స్ యాజమాన్యం తమను అవమానించేలా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
తమ దేశ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకోవాలని గతవారం పలు సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలకు నేపాల్ ప్రభుత్వం సూచించింది.
దీంతో కొందరు నకిలీ అకౌంట్లతో సోషల్ మీడియాను యాక్సెస్ చేసి తప్పుడు సమాచారం, దుష్ర్పచారం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కచ్చితంగా నేరమేనని స్పష్టం చేశాయి.
కాగా, ఫేస్బుక, ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం, చైనా యాప్ టాన్సెంట్, స్నాప్షాట్, పింట్రెస్ట్ వంటి పలు యాప్లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో నేపాల్లోని పలు వర్గాలు తీవ్రస్థాయి నిరసనలు చేపట్టారు. దీంతో సోమవారం అదుపు తప్పాయి. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు. దీంతో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని నిరసనకారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా యాప్లపై విధించిన నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకుముందు విధించిన బ్యాన్ సబబేనని ప్రభుత్వం సమర్ధించుకుంది.


